బావ కోసం మహేష్ మళ్లీ ట్వీట్ చేసాడు

                                                                                 (సూర్యం)

తన చిన్న బావ సుధీర్ బాబు అంటే మహేష్ బాబుకు మొదటి నుంచీ గౌరవం, ప్రేమ. దాంతో సుధీర్ బాబు  సినిమా ఆడియో ఫంక్షన్స్ కు వచ్చి ప్రాజెక్టుకు క్రేజ్ తేవటం, ట్రైలర్స్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేయటం వంటివి చేస్తూంటాడు. తాజాగా మరోసారి సుధీర్ బాబు సినిమాకు ప్రమోషన్ మొదలెట్టాడు. సుధీర్ బాబు కొత్త చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. ఆర్‌.ఎస్‌.నాయుడు దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ట్రైలర్
విడుదలైంది.  ఈ నేపధ్యంలో మహేష్ బాబు ఈ ట్రైలర్ ని ట్వీట్ చేసారు. అంతేకాకుండా ట్రైలర్ పై తన అభిప్రాయాన్ని తెలియచేసారు.

‘సినిమాల పరంగా చక్కగా వెళ్తున్నావు సుధీర్‌. నటుడిగా నీ కథల ఎంపిక నచ్చింది.  నిర్మాతగా నీ తొలి సినిమాకు నా నుంచి బెస్ట్‌ విషెస్‌ పంపుతున్నా. ‘నన్ను దోచుకుందువటే’ ట్రైలర్‌ ప్రామిసింగ్‌గా ఉంది. ఆల్‌ ది బెస్ట్‌’ అని ఆయన పేర్కొన్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా  షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పీవీపీ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాయి. ఇందులో అల్లరి నరేష్‌ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు.