మహర్షి సినిమా శాటిలైట్ ఆ టీవీకే

మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మాణమవుతున్న “మహర్షి “సినిమా శాటిలైట్  హక్కులను జెమినీ టీవీ అత్యధిక రేటుకు స్వంతం చేసుకున్నట్టు తెలిసింది . 

దిల్ రాజు, అశ్వినీ దత్ , పొట్లూరి వర ప్రసాద్  సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు . ఆత్యంత  భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని  రూపొందిస్తున్నారు . మహేష్ 25వ సినిమాగా మహర్షి ఇప్పటికే క్రేజ్ తెచ్చుకుంది .

మహేష్ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన టీజర్ కు వూహించనత రెస్పాన్స్  వచ్చింది . మహర్షి సినిమా లో మహేష్ బాబు ఓ పెద్ద సాఫ్ట్ వేర్ సంస్థలో సీఈఓ పాత్రలో నటిస్తున్నాడట మహర్షి సినిమా శాటిలైట్ హక్కుల కోసం చాలా ఛానెల్స్ పోటీ పడ్డాయని , చివరికి జెమినీ అత్యధిక రేటుకు స్వంతం  తీసుకుందని తెలిసింది .