పొలంలో మహేష్ పిచ్చ పిచ్చగా నచ్చేస్తున్నాడు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. మహేష్ బాబు 25వ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వంశీ పైడిపల్లి దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. భరత్ అనే నేను తర్వాత మహేష్ నటిస్తున్న మరో సందేశాత్మక చిత్రం గా పోస్టర్స్, టీజర్స్ ని బట్టి అర్దమవుతోంది. మే 9న మహర్షి చిత్రం విడుదల కానుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల వేగం పెంచింది. అందులో భాగంగా వదిలిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ పోస్టర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఇక ‘పదరా పదరా పదరా.. నీ అడుగుకి పదును పెట్టి పదరా. ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా’ అంటూ రైతులతో కలిసి అడుగులు వేశారు అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు. ఆయన నటించిన సినిమా ‘మహర్షి’లోని నాలుగో పాటను బుధవారం విడుదల చేయబోతున్నారు.

‘పదరా పదరా..’ అని సాగే ఈ పాటను ఏప్రిల్‌ 24న సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని సోమవారం ప్రకటిస్తూ దర్శకుడు వంశీ పైడిపల్లి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలోనూ మహేశ్‌ రైతులకు అండగా ఉండబోతున్నట్లు పోస్టర్‌ చూస్తే తెలిసింది.

‘మహర్షి’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ పాత్ర పోషించారు. నరేష్‌, మీనాక్షి దీక్షిత్‌, సోనాల్‌ చౌహాన్‌, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, పోసాని, రావు రమేశ్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. దిల్‌రాజు, అశ్వినీ దత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.