‘ఎన్టీఆర్-కథానాయకుడు’ పై లక్ష్మీ పార్వతి కామెంట్

ప్పటిలాగే ఎన్టీఆర్ బయోపిక్ ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ పై విరుచుకు పడ్డారు లక్ష్మీ పార్వతి. బయోపిక్ అంటే కేవలం సుఖంగా ఉండే పోర్షన్ మాత్రమే చూపించడం కాదని, కష్టాలను కూడా చూపించాలని, అప్పుడే అది సంపూర్ణమైన బయోపిక్ అవుతుందని అన్నారు.

అలాగే బాలకృష్ణ, క్రిష్ తీసింది పూర్తి బయోపిక్ కాదని, అందులో ఎన్టీఆర్ సగం జీవితమే ఉందని…. మా సినిమా(లక్ష్మీస్ ఎన్టీఆర్) వచ్చిన తర్వాతే బయోపిక్ సంపూర్ణం అవుతుందని లక్ష్మి పార్వతి అన్నారు. బాలయ్య తను తీసిన సినిమా చూడటానికి ఆహ్వానించలేదని ఆమె తెలిపారు. బాలకృష్ణ మంచి వాడే కానీ ఇంకా అతడి బావ చంద్రబాబు పరిధిలోనే ఉన్నాడని అని కామెంట్ చేసారు.

ఇక మహానుభావుడు ఎన్టీ రామారావుగారు సినిమాల్లోకి రాక ముందు కూడా చాలా కష్టాలు పడ్డారని వాటిని చూపలేదని లక్ష్మి పార్వతి చెప్పుకొచ్చారు. ఇక రామారావుగారిని వెన్నుపోటు పొడిచి అధికారంలో నుంచి దించేశారని, బయోపిక్ అన్నపుడు ఇవన్నీ చూపించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

తనపై మొదటి నుంచీ కావాలనే దుష్ప్రచారం చేశారని, రామారావుగారితో తనకు పెళ్లి కాలేదని తప్పుడు వార్తలు సృష్టించారని ఈ సందర్భంగా లక్ష్మి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి విషయంలో తనను టార్గెట్ చేస్తూ, ప్రజల్లో తననొక బూచిగా చూపించారని తెలిపారు.