‘మహానాయకుడు’పై లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ‘యన్‌టిఆర్‌ మహానాయకుడు’ఈ రోజు రిలీజైంది. భారీ తారాగణం, టాప్‌ టెక్నీషియన్స్‌ తో ఈ చిత్రంపై అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. చిత్రం బాగానే ఉందని టాక్ వచ్చినా చంద్రబాబు నాయుడుని పూర్తి సపోర్ట్ చేస్తూ తీసారనే విమర్శలు వచ్చాయి. ఈ నేపధ్యంలో లక్ష్మీ పార్వతి సినిమా గురించి స్పందించారు.

లక్ష్మీపార్వతి మాట్లాడుతూ…. తను సినిమా చూడలేదని కానీ అందరూ ఇది బయోపిక్ లా లేదని అంటున్నట్లు చెప్పుకొచ్చారు. సినిమాలో చంద్రబాబు గొప్పతనమే చూపించారని, ఈ విషయం తనకు ముందే తెలుసునని అన్నారామె. ఎన్టీఆర్ బయోపిక్ లో వాస్తవాలు చూపించే ధైర్యం బాలయ్యకి లేదని, చంద్రబాబుతో అన్ని లింకులు పెట్టుకున్న బాలయ్య తన తండ్రికి జరిగిన ద్రోహాన్ని ఎలా చూపిస్తారని కామెంట్స్ చేసింది.

అలాగే సినిమాలో తన ప్రస్తావన తీసుకొస్తే ఎన్టీఆర్ కి జరిగిన అన్యాయాన్ని చూపించాలని ఆ ధైర్యం వాళ్లకు లేదని, వాస్తవాలు లేవు కాబట్టే జనాలు కూడా ఈ సినిమాకి సరైన తీర్పునిచ్చారని విమర్శలు చేసారామె. ఇక రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను వాస్తవికతతో చూపించబోతున్నారని చెప్పింది. ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.