షాకింగ్: ఆస్ప‌త్రిలో టాలీవుడ్ లేడీ డైరెక్ట‌ర్

టాలీవుడ్ ద‌ర్శ‌కురాలు సంజ‌నా రెడ్డి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని స‌మాచారం. అధిక జ్వ‌రం.. మెద‌డులో ర‌క్త‌స్రావం అవ్వ‌డంతో సోమాజిగూడ య‌శోద ఆస్ప‌త్రిలో చేరార‌ని తెలుస్తోంది. సంజ‌న రెడ్డి జ‌ర్న‌లిస్ట్ కం డైరెక్ట‌ర్.

సంజనారెడ్డి ప్ర‌స్తుతం క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి అనే బ‌యోపిక్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించేందుకు రెడీ అవుతున్నార‌ని ప్ర‌చార‌మైంది. అస్వ‌స్థ‌త‌కు కార‌ణాల్ని ఆరా తీస్తే.. ఇటీవల కొంతకాలంగా డైటింగ్ చేస్తున్నార‌ని.. అది విక‌టించ‌డంతో బ్రెయిన్ వీక్ నెస్ వచ్చి నేల‌పై పడిపోయారని ప్ర‌చార‌మ‌వుతోంది. తాను నివ‌శిస్తున్న ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో త‌న‌ పెంపుడు కుక్క గట్టిగా అరిచి వాచ్ మన్ ను అలెర్ట్ చేసిందిట‌. ఆ వెంటనే ఆస్ప‌త్రిలో చేర్చారు.

సంజ‌న‌కు ఎలాంటి ప్ర‌మాదం లేదు. ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి ఎప్పుడు? అన్న‌దానిపై స‌మాచారం తెలియాల్సి ఉంది. త‌న‌కు ప్ర‌మాదం లేద‌న్న సంగ‌తిని క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి బ‌యోపిక్ నిర్మాత కోన వెంక‌ట్ వెల్ల‌డించారు.

టాలీవుడ్ లో మ‌హిళా ద‌ర్శ‌కుల వెల్లువ అంతంత మాత్ర‌మే. విజ‌య‌నిర్మ‌ల‌.. జీవిత‌.. నందిని రెడ్డి.. ఇలా సింగిల్ డిజిట్ మాత్ర‌మే క‌నిపిస్తోంది. వీళ్ల‌తో పాటే మీడియా నుంచి ఒక్కో మెట్టు ఎదిగి ద‌ర్శ‌కురాలు అయ్యారు సంజ‌నా రెడ్డి. విశాఖ న‌గ‌రానికి చెందిన సంజ‌న ఆరంభం ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతిలో లైఫ్ స్టైల్ జ‌ర్న‌లిస్టుగానూ ప‌ని చేశారు. అనంత‌రం ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ లో రాజుగాడు సినిమాతో ద‌ర్శ‌కురాలు అయ్యారు.