తిత్లీ బాధితుతుల కోసం విశాఖ పట్టణంలోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ తరుపున నిర్వాహకులు 5 లక్షల రూపాయల చెక్కు ముఖ్య మంత్రికి అందజేశారు . శ్రీకాకుళం జిల్లాలో వరదల వల్ల నస్టపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు కెఎస్ రామారావు , కార్యదర్శి శ్రీనివాస రాజు , సభ్యులు అశోక్ కుమార్, భాస్కర్ నాయుడు , మెహర్ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడును కలసి చెక్ అందించారు . ఈ సందర్భంగా వారిని ముఖ్య మంత్రి అభినందించారు . ఈ సందర్భంగా సినిమా పరిశ్రమకు వైజాగ్ అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని అందుకే సభ్యుల కోసం కల్చరల్ సెంటర్ ప్రారంభినచ్చని రామారావు చెప్పారు . శ్రీకాకుళంలో నష్టపోయిన వారిని ఆదుకోవడంమానవతా ధర్మముగా ధర్మగా భావించామని , అందుకే 5 లక్షల విరాళాన్ని అందించామని ఆయన చెప్పారు