స‌ర్కారు వారి భామ‌కి చెక్..మ‌హాన‌టి ఫిక్సైంది

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న 27వ చిత్రం `స‌ర్కారు వారి పాట‌`లో హీరోయిన్ గా ఏ భామ‌ని ఎంపిక చేస్తారు? అన్న దానిపై కొద్ది రోజులుగా స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. కీర్తి సురేష్‌, పూజా హెగ్దే, కియారా అద్వాణీ, సాయి మంజ్రేక‌ర్ పేర్లు జోర‌గా ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. ఈ న‌లుగురిలో ఏ భామ‌ని తీసుకుంటారు? అన్న దానిపై ర‌క‌ర‌కాల డిబేట్లు సాగాయి. ముఖ్యంగా కియారా, సాయి మంజ్రేక‌ర్ పేర్లు ఈ వేవ్ లో ఎక్కువ‌గా హైలైట్ అయ్యాయి. తాజాగా ఆ ప్ర‌చారానికి చెక్ పెట్టింది కీర్తి సురేష్‌. ఆఛాన్స్ మ‌రెవ‌రిదో కాదు..నాదేనంటూ ఇన్ స్టా గ్రామ్ చాట్ లో ధృవీక‌రించింది. అభిమానుల‌తో చాట్ చేస్తోన్న సంద‌ర్భంలో ఓ ఫ్యాన్ ఈ క్వ‌శ్చ‌న్ రెయిజ్ చేసాడు. దీంతో సూటిగా మ‌హేష్ స‌ర‌స‌న న‌టించేంది నేనే నంటూ కీర్తి బ‌ధులిచ్చింది.

దీంతో స‌ర్కారు వారి భామ? ఇన్నాళ్లు ఎవ‌రు అంటూ సాగిన ప్ర‌చారానికి…స‌స్పెన్స్ ఎట్ట‌కేల‌కు తెర‌పడి‌నట్లైంది. మ‌హాన‌టి సినిమాతో కీర్తి సురేష్ కు తెలుగులో మంచి పేరొచ్చింది. కానీ స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకోవ‌డంలో మాత్రం వెనుక‌బ‌డింది. మ‌హాన‌టి స‌క్సెస్ త‌ర్వాత కోలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ లో వ‌చ్చిన అవ‌కాశాలు వ‌దులుకుంది అన్న ప్ర‌చారం సాగింది. అయితే ఇటీవ‌ల అమ్మ‌డు తెలుగులో చేస్తోన్న సినిమా సంఖ్య చూస్తుంటే మ‌ళ్లీ స్పీడ్ పెంచిన‌ట్లే తెలుస్తోంది. తాజాగా పారితోషికం కూడా త‌గ్గించుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

లాక్ డౌన్ నేప‌థ్యంలో అన్ని ప‌రిశ్ర‌మ‌లు ఆర్ధికంగా న‌ష్టాల్లో ఉన్నాయి. అందులో సినిమా రంగం కూడా ఒక‌టి. కాబ‌ట్టి న‌టిగా త‌న పారితోషికం త‌గ్గ‌తించుకోవ‌డానికి స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చింది. ఓ స్టార్ హీరోయిన్ ఇలా పారితోషికం త‌గ్గించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. చాలా మంది హీరోయిన్లు నిర్మాత ముక్కు పిండి పైసా కూడా వ‌ద‌ల‌కుండా వ‌సూల్ చేస్తారు. కానీ కీర్తి సురేష్ ప‌ట్టు విడుపు ఉండే న‌టిన‌ని చెప్ప‌క‌నే చెప్పింది. న‌టిగా ప‌రిశ్ర‌మ క‌ష్టాల‌ను ముందే అంచ‌నా వేయ‌డం కీర్తి కే చెల్లింది. అన్న‌ట్లు కీర్తి క‌న్న‌డ న‌టి మేన‌క కుమార్తె అన్న సంగ‌తి తెలిసిందే.