క్రిష్ రాబందు, బాలయ్యను చూస్తే బాధగా ఉంది

చూస్తూంటే క్రిష్ ని ఇప్పుడిప్పుడే వదిలేలా లేదు కంగనా రనత్. ఈ సారి ఆమె ఎటాక్ డోస్ మరికాస్త పెంచింది. రీసెంట్ గా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్యూర్ ప్రస్దావన కూడా తీసుకొచ్చింది. బాలయ్యపై సానుభూతి చూపిస్తూ క్రిష్ వంటి డైరక్టర్ ని పెట్టుకోవటం బాలయ్య తప్పు అన్నట్లు మాట్లాడింది. ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్యూర్ నేపథ్యంలో క్రిష్ టార్గెట్ చేసుకొని కంగన ధ్వజమెత్తింది.

కంగనా మాట్లాడుతూ… ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలకు పెట్టిన డబ్బు కూడా రాలేదని చదివాను. బాలకృష్ణ లాంటి హీరో కెరీర్‌కే మచ్చగా మారింది. బాలకృష్ణ సార్‌ను చూస్తే బాధగా ఉంది. పాపం క్రిష్‌ను పూర్తిగా నమ్మి జీవితాన్నే పణంగా పెట్టాడు అని కంగన పేర్కొన్నది.

మణికర్ణిక సినిమా విషయంలో రాబందులా వేధించిన క్రిష్‌కు తగిన సమాధానం చెప్పే సమయం వచ్చిందన్నారామె. ఈ సినిమా విషయంలో నా దేహంలోని రక్తాన్ని పీల్చుకొనేంత పనిచేశాడు. సినిమాను దెబ్బ తీయడానికి మాటల దాడి చేశాడు. వేధించాడు అని కంగన అన్నారు.

ఇక మణికర్ణిక సినిమాపై ఓ వైపు సినీ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తుంటే.. క్రిష్ సిగ్గులేకుండా చాలా నీచంగా మాట్లాడారు. మీడియాకు డబ్బులు వెదజల్లి వీరనారి ఝాన్సీ బయోపిక్‌ను దెబ్బ తీయడానికి ప్రయత్నించాడు. వారి ప్రవర్తనతో విసిగిపోయాను. కానీ కొందరు ఫూల్స్‌ను ఎదురుకోవడానికి సమరవీరులు నాకు శక్తిని ఇచ్చారు అని కంగన మండిపడింది.