సినిమాలకు కమల్ గుడ్ బై

కమల్ హాసన్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నాడా ? కొచ్చి  మీడియా అవుననే అంటున్నది . కమల్ హాసన్ ద్రుష్టి చాలా కాలంగా రాజకీయాలపై వుంది .

జయలలిత చని పోయిన  తరువాత  తమిళనాడులో రాజకీయాన్ని స్వయంగా చూసాడు కమల్ . అందుకే “మక్కల్ నీధి మైమ్ ” అన్న పార్టీని ప్రారంభించి తమిళనాడు అంత విస్తృతంగా పర్యటన కూడా చేశాడు . ఆ తరువాత ఎందుకో కాస్త వెనకడుగు వేశాడు . ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో “ఇండియన్ 2” సినిమాలో నటించబోతున్నాడు .

ఈ విషయాన్ని కమల్ స్వయంగా చెప్పాడు . ఒక కార్యక్రమం కోసం కోచి వెళ్ళాడు . అక్కడ జర్నలిస్టులతో మాట్లాడుతూ “ఇండియన్ 2″ నా చివరి సినిమా కావచ్చు. నేను రాజకీయాల్లో వున్నాను, పార్టీ కూడా స్థాపించాను . అయితే క్రియాశీలకంగా లేకపోచ్చు . 2019లో తమిళనాడులో జరిగే ఎన్నికల్లో మా పార్టీ  పోటీ చేస్తుంది . ఈ విషయంలో మళ్ళీ  వెనకడుగు వెయ్యను” అని చెప్పాడు కమల్ .