‘2.0’ ని అడ్డం పెట్టి డైరక్టర్ కు తెగ సోప్ వేస్తోంది

ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘2.0’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా చూడాలని సినీ సెలబ్రెటీలు సైతం చాలా మంది కలగంటున్నారు. అయితే వాళ్లు షూటింగ్ లో ఉంటే ఇబ్బంది కదా. డైరెక్టర్‌ ఫర్మిషన్ ఇవ్వాలి. అయితే తమ దర్శకుడు సినిమా చూడనివ్వలేదని అంటున్నారు కల్యాణి ప్రియదర్శన్‌.

ప్రస్తుతం కల్యాణి తిరుమల కిశోర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘చిత్రలహరి’ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. సాయి ధరమ్‌ తేజ్‌ హీరో గా చేస్తున్నారు. అయితే కల్యాణి ఈరోజు ‘2.0’ చిత్రాన్ని చూడాలని అనుకున్నారట. కానీ ‘చిత్రలహరి’ సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడంతో దర్శకుడు కిశోర్‌ ‘2.0’ చూడటానికి ఫర్మిషన్ ఇవ్వలేదట. ఈ విషయాన్ని కల్యాణి ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ తన బాధను చెప్పుకొన్నారు. అయితే ఇది చదివిన వారంతా డైరక్టర్ డెడికేషన్ చెప్తున్నట్లు ఉంది కానీ సినిమా చూడకుండా ఆగిపోయిన బాధ కాదు.ఈ వంకన డైరక్టర్ కు సోప్ వేస్తోందని అంటున్నారు. 

ఆ ట్వీట్ లో …‘డైరెక్టర్‌ గారు షూటింగ్ ను మధ్యలో నిలిపివేసి నన్ను ‘2.0’ సినిమాను చూడనివ్వడంలేదు. ఆ మ్యాజిక్‌ చూడాలని నాకెంతో ఆత్రుతగా ఉంది. మా సినిమా షూటింగ్ పూర్తవగానే తప్పకుండా ‘2.0’ చూస్తాను’ అని పేర్కొంటూ సెట్స్‌లో తీసిన కిశోర్‌ ఫొటోను షేర్ చేసుకుంది.