ఆచార్య నుంచి కాజ‌ల్ ఔట్!

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న 152వ సినిమా ఆచార్య లాక్ డౌన్ అనంత‌రం తిరిగి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారు? అన్న దానిపై స‌రైన క్లారిటీ లేదు. మే 3 తో లాక్ డౌన్ ముగిస్తారా? పొడిగిస్తారా? అన్న దానిపై అన్ని రాష్ర్టాల ముఖ్య మంత్రుల నుంచి భిన్న స్వ‌రాలు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్రం తీసుకునే నిర్ణ‌యంపై సర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. స‌రిగ్గా ఇదే అంశంపై చాలా మంది సెల‌బ్రిటీలు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. లాక్ డౌన్ ఎత్తేస్తే అంద‌రూ యాథావిథిగా తిరిగి షూటింగ్ లు ప్రారంభిస్తారు. దీంతో ముందు వెన‌క‌..వెన‌క ముందు అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది.

అయితే ముందు క‌మిట్ మెంట్ ఇచ్చిన చిత్రాల‌నే ఎవ‌రైనా పూర్తి చేయాల్సి ఉంటుంది కాబ‌ట్టి! ఆ దిశ‌గానే హీరో, హీరోయిన్లు ముందుకు సాగుతారు. తాజాగా ఈ కారంణంగానే మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ ని కాజ‌ల్ అగర్వాల్ వ‌ద‌లుకుంద‌ని ఓ వార్త ఫిలిం స‌ర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. ఇప్ప‌టికే అమ్మ‌డి చేతిలో కొన్ని త‌మిళ్ సినిమాలున్నాయి. జూలైలో ఏకంగా రెండు సినిమా షూటింగ్ ల్లో పాల్గొనాల్సి ఉంటుందిట‌. అదే జ‌రిగితే ఆచార్య కు డేట్లు కేటాయించ‌డం క‌ష్ట‌మ‌ని త‌న‌కు తానుగానే ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుందిట‌. అనూహ్యంగా జ‌న‌తా క‌ర్ఫ్యూ తో మొద‌లైన బంద్ అంటుపై ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీసిందో తెలిసిందే.

లేదంటే ఇప్ప‌టికే కాజ‌ల్ ఆచార్య షూటింగ్ పూర్తి చేయాల్సి ఉందిట‌. ముందుగా ఈ సినిమాలో నాయిక‌గా త్రిష‌ను ఎంపిక చేసారు. చాలా మంది భామ‌ల్ని ప‌రిశీలించి చివ‌రికి త్రిష‌ను తీసుకున్నారు. కానీ ఆమె పాత్ర విష‌యంలో సంతృప్తి చెంద‌క‌పోవ‌డంతో త‌ప్పుకుంది. దీంతో చిరుతో ఖైదీ నంబ‌ర్ 150 లోన‌టించిన అనుభ‌వం ఉండ‌టంతో కాజ‌ల్ ని భారీ పారితోషికం ఇచ్చి తీసుకున్నారు. కానీ ఇప్పుడా ఆ ఛాన్స్ కాజ‌ల్ చేజార్చుకోవాల్సి వ‌చ్చింది.