‘జై బాలయ్య’ అంటూ ఎన్టీఆర్ అరుపులు! ఎందుకలా?

బాబాయ్‌ బాలకృష్ణపై ఉన్న ప్రేమ‌ను చాటుకుని నందమూరి అభిమానుల ప్రేమను మరోసారి పొందాడు ఎన్టీఆర్. రీసెంట్ గా రాజ‌మౌళి కుమారుడు పెళ్లి వేడుక‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడ జ‌రిగిన ఓ పార్టీలో జై బాల‌య్య అంటూ ఎన్టీఆర్ అర‌వడం ఇప్పుడు వైర‌ల్ అయిపోయింది. అప్ప‌టికే ఒక‌రు జై బాల‌య్య అంటే.. దానికి వంత పాడుతూ యంగ్ టైగ‌ర్ కూడా జై బాల‌య్య అంటూ అరిచి రచ్చ రచ్చ చేసారు.

పార్టీ అంతా జై బాల‌య్య నినాదాల‌తో మోగిపోయింది. మొత్తానికి అబ్బాయి నోటి వెంట బాబాయ్ పేరు విని నందమూరి ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. ఇక ఎందుకు జై బాలయ్య అంటూ గట్టిగా అరిచారు అనే విషయం క్లారిటీ లేదు కాని నందమూరి ఫ్యాన్స్ మాత్రం చాలా సంతోషంగా ఆ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఇక అభిమానులు అంతా అసలేం జరిగింది ..ఎందుకలా జనం బాలయ్య నామస్మరణ చేసారనే విషయమై తెగ చర్చలు చేస్తున్నారు. అఖిల్ మొదట ‘జై బాలయ్య’ అంటూ అరిచాడు. దీంతో అక్కడున్నవారంతా అదే స్లోగాన్‌ను అందుకున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా ‘జై… బాలయ్య’ అంటూ మరోసారి హోరెత్తించారు.

ఇక తాజాగా రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం రాజస్థాన్ లోని జైపూర్ కోటలో జరిగిన విషయం తెల్సిందే. ఈ పెళ్లిలో ఎన్టీఆర్ తో పాటు ఎంతో మంది స్పెషల్ గెస్ట్ లు పాల్గొన్నారు. కార్తికేయ పెళ్లి సంగీత్ కార్యక్రమంలో ఎన్టీఆర్ మరియు వారంతా కలిసి ఎంజాయ్ చేశారు. ఆ సందర్బంగా తీసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

ఇక చాలా కాలంగా విభేదిస్తూ వస్తున్న బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ లు హరికృష్ణ మరణం తదనంతర కార్యక్రమాల తర్వాత కలిసి పోయారు. హరికృష్ణ మరణంతో కుటుంబంలో ఫ్యామిలీలో ఉన్న సమస్యలు అన్నీ సమిసిపోయి..అంతా ఒకటయ్యారు. ఆమద్య ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో బాలయ్య పాల్గొనగా తాజాగా జరిగిన ‘ఎన్టీఆర్’ ఆడియో విడుదల కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించి అలరించాడు.