బిగ్ సర్పైజ్: ఎన్టీఆర్ ని గెస్ట్ గా పిలిచారు

మహానటుడు నందమూరి తారక రామారావు జీవితకథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘యన్.టి.ఆర్’.యన్.టి.ఆర్ పాత్రలో బాల‌కృష్ణ‌, ఆయన సతీమణి పాత్రలో విద్యాబాల‌న్ న‌టిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఈ నేఫధ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను, ఆడియోను డిసెంబర్ 21న విడుదల చేయనున్నారు.

అయితే ఈ ఫంక్షన్‌కి ప్రత్యేక అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ వస్తున్నాడా , రాడా ,పిలిచారా లేదా అనే చర్చ గత కొద్ది రోజులుగా మీడియాలో జరుగుతోంది. కొందరైతే ఎన్టీఆర్ ని పిలవరు అని ఫిక్స్ అయ్యిపోయారు. అయితే ఎన్టీఆర్ ని ఈ ఫంక్షన్ కు పిలిచామని చిత్ర యూనిట్ అఫీషియల్ గా తెలిపింది.

కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాదు.. నందమూరి కుటుంబ సభ్యులు మొత్తం ఈ వేడుకకు హాజరుకానున్నారని సమాచారం. అంతేకాక.. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా సూపర్‌స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు, ఆనాటి నటీమణులు జమున, గీతాంజలీ సహా చాలా మంది ప్రముఖులు హాజరవుతున్నట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.

క్రిష్ జాగ‌ర్ల‌మూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా మాట‌లు రాస్తున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్.. ‘యన్.టి.ఆర్ క‌థానాయ‌కుడు’, ‘యన్.టి.ఆర్ మ‌హానాయ‌కుడు’గా రెండు భాగాల్లో రానుంది.