త్రివిక్రమ్ మీద నాగార్జున కోపం! అందుకేనా?

త్రివిక్ర‌మ్‌ని కావాల‌నే కింగ్ సైడ్ చేశాడా?

2002లో వ‌చ్చిన `మ‌న్మ‌థుడు` సినిమా ఇప్ప‌టికీ గుర్తుందంటే అందులోని పంచ్ డైలాగ్‌లే కార‌ణం. సినిమాలో డైలాగ్‌లు ఓ రేంజ్‌లో పేలాయి. ఇన్నేళ్ల‌యినా ఆ సినిమా అంద‌రిని వెంటాడుతోందంటే దానికి ప్ర‌ధాన కార‌ణం త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌. ఆయ‌నే ఈ చిత్రానికి డైలాగ్‌లు రాశారు. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కానీ నాగ్ మాత్రం ఆ విష‌యాన్ని లైట్ తీస్కోవ‌డం ప‌లువురిని షాక్‌కు గురిచేస్తోంది. నాగార్జున తాజాగా `మ‌న్మ‌థుడు-2` చిత్రాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ ఆదివారం రాత్రి హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా `మ‌న్మ‌థుడు` చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు విజ‌య‌భాస్క‌ర్‌ని నాగ్ ఆహ్వానించారు. ఆయ‌న‌ని వేదిక మీద‌కి పిలిచి ఆయ‌న వ‌ల్లే `మ‌న్మ‌థుడు` సినిమా హిట్ట‌యింద‌రి, సినిమాలోని పంచ్‌ డైలాగ్‌లు కూడా ఆయ‌న రాసిన‌వేన‌ని క్రెడిట్ మొత్తం విజ‌య‌భాస్క‌ర్‌కే ఇచ్చేశారు. అదేంటి డైలాగ్‌లు రాసింది త్రివిక్ర‌మ్ క‌దా?. ఆయ‌న రాసిన డైలాగ్‌లు లేక‌పోతే ఆ సినిమాకే బ్యూటీ లేదు క‌దా? అని అంతా అవాక్క‌వుతున్నారు. నాగ్ కెరీర్‌లో `మ‌న్మ‌థుడు` చిత్రానికి ప్ర‌త్యేక స్థానం వుంది. ఇది జ‌గ‌మెరిగిన స‌త్యం. అలాంటి చిత్రానికి ప్ల‌స్‌గా నిలిచింది డైలాగ్‌లే. ఆ విష‌యాన్ని నాగార్జున మ‌రిచి త్రివిక్ర‌మ్ పేరుని మాట మాత్రం కూడా త‌ల‌వ‌క‌పోవ‌డం ఒకింత ఆశ్చ‌ర్యాన్ని అనుమానాన్ని క‌లిగిస్తోంది.

అఖిల్‌ని త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌రిచ‌యం చేయాల‌ని నాగ్ ప్ర‌య‌త్నించాడు. కానీ అది కుద‌ర‌లేదు. నాగ చైత‌న్య‌తోనూ త్రివిక్ర‌మ్ సినిమా చేయ‌లేదు. స‌మంత‌తో మాత్రం వ‌రుస హిట్‌లు ఇచ్చాడు. అక్కినేని క్యాంప‌స్‌లో ముగ్గురు హీరోలున్నా ఒక్క‌రితో కూడా త్రివిక్ర‌మ్ సినిమా చేయ‌లేదు. ఆ ప్ర‌య‌త్నాలు కూడా చేయ‌లేదు. స్వ‌యంగా అఖిల్‌తో సినిమా చేసిపెట్ట‌మ‌ని నాగ్ కోరినా త్రివిక్ర‌మ్ స్పందించ‌లేద‌ట‌. అదే నాగా్‌కు మండేలా చేసింద‌ని, ఆ కార‌ణంగానే `మ‌న్మ‌థుడు-2` ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌లో కావాల‌నే త్రివిక్ర‌మ్ పేరుని నాగ్ ఎత్త‌కుండా బ‌దులు తీర్చుకున్నార‌ని టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.