ఇలియానా అతి చేస్తోంది,అందుకే ఆమెకు బై !?

హీరోయిన్స్ ..తమను తాను ఎక్కువగా ఊహించుకుంటూ తమ కెరీర్ లను నాశనం చేసుకుంటూంటారు. తమకు మార్కెట్లో ఎంత క్రేజ్ ఉందో అర్దం చేసుకోకుండా ఎక్కువ రెమ్యునేషన్స్ అడగటం, కండీషన్స్ పెట్టడం వంటివి చేస్తూంటారు. అయితే నడిచినంతకాలం తమంతవారు లేరనేది చెల్లుబాటే కానీ మిగతారోజుల్లో అలాంటివి నడవటం కష్టం. దాంతో నిర్మహమాటంగా దర్శక,నిర్మాతలు వాళ్లను ప్రక్కన పెట్టేస్తూంటారు. తర్వాత తేరుకుని చూసుకునే సరికి ఏమీ ఉండదు. ఇప్పుడు ఇలియానా పరిస్దితి అదే అంటున్నారు తెలుగు సినిమా జనం.

దాదాపు ఆరేళ్ల త‌ర్వాత అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రంతో ఇలియానా తెలుగుకి రీఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. సినిమాలో ఆమెను సి చూసిన వాళ్లు బాగా ఒళ్లు చేసిందన్నారు. దాంతో మిగతా నిర్మాతలు హీరోయిన్ గా ఆమెను తీసుకుందామనుకున్నా ఆ కామెంట్స్ తో ఆగిపోయారు. కానీ బోయపాటి శ్రీను స్కూల్ వేరే. ఆమెతో స్పెషల్ సాంగ్ చేయిస్తే ఎలా ఉంటుంది అనిపించింది. కానీ ఇక్కడే ఇలియానా చేసిన అతి ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

వివరాల్లోకికి వెళితే.. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాబోతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ప్రస్తుతం స్పెషల్ సాంగ్ చిత్రీకరణను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ ను పూర్తి చేసుకోనుంది. కాగా ఈ స్పెషల్ సాంగ్ లో నటించడానికి చిత్ర యూనిట్ మొదటిగా ఇలియానా ని సంప్రదించింది.

అయితే సాంగ్ లో చేయడానికి ఓకే అన్న ఈ గోవా బ్యూటీ, తనని తానూ ఎక్కువ ఉహించుకొని రెమ్యూనిరేషన్ని భారీ మొత్తంలో డిమాండ్ చేసిందట. దాదాపు ఒక్క సాంగ్ కోసమే 65 లక్షలు అడిగిన్నట్లు తెలుస్తోంది. దాంతో చిత్ర యూనిట్ కు షాక్ అయ్యిందిట. ఇక మళ్ళీ ఆమెను సంప్రదించలేదట.

కాగా ఈ ‘వినయ విధేయ రామ’ సంక్రాంతికి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ‘భరత్ అనే నేను’ ఫెమ్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ హీరో, హీరోయిన్లు ప్రశాంత్ మరియు స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.