ఇకనైనా హీరో సిద్ధార్ధ్ ను ఆదరిస్తారా

హీరో సిద్ధార్ధ్ మరియు మ్యూజిక్‌ డైరక్టర్‌ కమ్‌ హీరో జీవీ ప్రకాష్‌ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ తాజా చిత్రం పేరు ‘ఎరుపు పసుపు పచ్చ’. తమిళంలో ‘సివప్పు మంజల్‌ పచ్చై’ పేరుతో రూపొందుతోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది శశి. ఆయన పేరు చెప్పడంకన్నా ‘బిచ్చగాడు’ దర్శకుడు శశి అంటే వెంటనే అందరికీ గుర్తుకొస్తారు. ‘బిచ్చగాడు’ తర్వాత స్క్రిప్ట్ మీద బాగా వర్క్‌ చేసి ఆయన తెరకెక్కిస్తున్న చిత్రమిది.

ఈ కలయికలో ‘ఎరుపు పసుపు పచ్చ’ను అభిషేక్‌ ఫిల్మ్స్‌ అందిస్తోంది. తమిళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఫైనాన్షియర్‌గా వ్యవహరించి, తెలుగులో ‘శివలింగ’, ‘బ్లఫ్‌మాస్టర్‌’ వంటి హిట్‌ చిత్రాలను అందించిన రమేష్‌ పిళ్లై ‘ఎరుపు పసుపు పచ్చ’ను నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం గురించి హీరో సిద్ధార్థను అడిగితే.. ‘‘ఒక ట్రాఫిక్‌ ఇనస్పెక్టర్‌కీ, ఒక బైక్‌ రేసర్‌కీ మధ్య సాగే ఎమోషనల్‌ వార్‌ చిత్రమిది. మంచి భావోద్వేగాలతో కూడిన ఫ్యామిలీ డ్రామా. సెప్టెంబర్‌ ప్రథమార్ధంలో తమిళ్‌తో పాటు తెలుగు, హిందీలోనూ విడుదల చేస్తాం. ఏ ఒక్క భాషకో పరిమితమయ్యే కథ కాదు ఇది. అందరికీ కనెక్ట్‌ అవుతుంది. యూనివర్శల్‌ సబ్జెక్ట్‌. చూసిన ప్రతి వారూ తప్పకుండా కొత్తదనాన్ని ఆస్వాదిస్తారు. దర్శకుడు శశి ‘బిచ్చగాడు’ తర్వాత ఆయన నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో నాకు తెలుసు.
అందుకే వాళ్లందరినీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ కథను సిద్ధం చేసుకున్నారు. మంచి భావోద్వేగాలున్న సబ్జెక్ట్‌ ఇది. అందరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు.

ఏదేమైనా ఈ చిత్రంతోనైనా సిద్ధార్థను ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో చూడాలి.