పద్మశ్రీ కోసం పోటీ పడుతున్న ఇద్దరు సినీ దిగ్గజాలు

భారత దేశపు అత్యున్నత గౌరవం ‘పద్మశ్రీ’. ఒక్కో పరిశ్రమలో అత్యున్నతంగా పని చేసి గౌరవం దక్కించుకున్నవారికి భారత ప్రభుత్వం ఈ అవార్డును బహూకరిస్తుంది. దీని కోసం దేశవ్యాప్తంగా పోటీ ఉంటుంది.

దక్షిణాదిన మన తెలుగు నాట, మన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇద్దరు సినీ దిగ్గజాల పేర్లను పంపించింది. వారెవరో కాదు – ప్రసాద్ లాబ్స్ మరియు ఐమాక్స్ అధినేత రమేష్ ప్రసాద్ మరియు దర్శకుడు కె. రాఘవేంద్ర రావు. అసలైతే అయిదుగురి పేర్లను పంపవచ్చు కానీ కమిటీ బాగా జల్లెడ పట్టి ఇద్దరు దిగ్గజాలైన వారి పేర్లను మాత్రమే పంపించింది.

ఈ ఇద్దరూ సినీ రంగానికి చేసిన సేవను దృష్టిలో ఉంచుకుని వీరి పేర్లను సూచించినట్టు తెలిపారు విజయేందర్ రెడ్డి, ట్రెషరర్, తెలుగు సినీ ఛాంబర్ ఆఫ్ కామర్స్.