అందరూ దాసోహం అవ్వాల్సిందే – పూజ హెగ్డే

Pooja Hegde Fixes a peg for her Dad

అందరూ దాసోహం అవ్వాల్సిందే – పూజ హెగ్డే

సంగీతానికి దాసోహం కానివారెవ్వరు? అంటోంది పూజాహెగ్డే. “భాషతో పనిలేదు. భావం అవసరం లేదు. స్వరాల ఊయల ఊగడానికి మ్యూజిక్ అనే మ్యాజిక్ చాలు. నాక్కూడా సంగీతమంటే చాలా ఇష్టం. నేనెప్పుడూ ఉత్సాహంగా ఉండడానికి సంగీతమే” అంటోంది పూజాహెగ్డే.

సౌత్ లో ప్రస్తుతం సూపర్ పాపులర్ హీరోయిన్స్ లిస్టులో పూజాహెగ్డే ఒకరు. వరుసగా టాప్ స్టార్స్ అందరితో జోడీ కడుతున్నారు. పూజాహెగ్డే రోజూ పాటలు వింటూనే ఉంటుందట! కాస్త సమయం దొరికినా తన సెల్ ఫోన్ లో పాటలు మోగాలిసిందేనట! ఇదివరకు హిందీ, ఇంగ్లీష్ పాటలు వినేదట. ఎప్పుడు ప్రాంతీయ భాషల్లో అన్ని పాటలూ వింటోందిట! మరీ ముఖ్యంగా తెలుగు పాటలకు ప్రాధాన్యం ఇస్తోందిట!

తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానని, తెలుగు పాటలు వింటూవుంటే ఆ భాష త్వరగా వస్తుందని పూజా నమ్మకమట! తెలుగు సంగీతంలో చాలా మార్పులు వచ్చాయి. మాస్ గీతాలతోపాటు, మెలోడీలకూ ప్రాధాన్యం ఇవ్వడం బాగుందని చెబుతోంది పూజా. తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ యమజోరు మీదుంది. బాలీవుడ్ లో హౌస్ ఫుల్-4 సినిమా పూర్తి చేసింది.

తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ తో 3 చిత్రాల డీల్ కుదుర్చుకున్నారట. జుడ్వా ,హౌస్ ఫుల్, 2 స్టేట్స్, కిక్, బాఘీ సినిమాలను నిర్మించిన సాజిద్ నడియాడ్ వాలా ఈ మూడు సినిమాలను భారీ స్థాయిలో నిర్మించనున్నారట! హౌస్ ఫుల్ తర్వాత ఓ యాక్షన్ సినిమాను ఈ బ్యానర్ లో పూజాహెగ్డే చేయబోతున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

ఈ సినిమా కోసం పూజాహెగ్డే దాదాపు మూడు నెలల భారీ డేట్స్ కూడా ఇచ్చారట. ఇందులో ఎన్నో స్టన్ టులు ఉండబోతున్నాయని, వాటిని పూజా స్వయంగా చేయబోతున్నారని తెలిసింది. యాంజే లీనా జోలీ నటించిన హాలీవుడ్ ప్యాంటసీ థ్రిల్లర్ టూబ్ రైడర్ తరహాలో ఈ చిత్ర కథ సాగనుందట. ఈ త్రీ మూవీస్ డీల్ లో భాగంగా చేసిన సినిమాలు సక్సెస్ అయితే పూజా బాలీవుడ్ లోనూ టాప్ లిస్ట్ లో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది!