దిల్ రాజు పెళ్లి లో టాలీవుడ్ అతిధులా?

లాక్ డౌన్ నేప‌థ్యంలో పోలీస్ కాన్సెప్ట్.. రాజుగారు అంతేగా!

నిర్మాత దిల్ రాజు నిజామాబాద్ లో ఆదివారం రెండ‌వ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కుమార్తె హ‌న్షిత కొరిక మేర‌కు రాజుగారు ఈ వివాహానికి ఒప్పుకున్న‌ట్లు..ఆమె బ‌లవంతం మీద‌నే పెళ్లి జ‌రుగిన‌ట్టు తెలుస్తోంది. వివాహం అనంత‌రం కుమార్తె ప్ర‌త్యేకంగా తండ్రికి శుభాకాంక్ష‌లు తెలిపింది. వివాహం కేవ‌లం కుటుంబ స‌భ్యులు..కొద్ది మంది స‌న్నిహితుల స‌మక్షంలోనే జ‌రిగిన‌ట్లు తెలిసింది. అయితే టాలీవుడ్ నుంచి మాత్రం ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు హాజ‌రైన‌ట్లు తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.

యంగ్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి, హారిష్ శంక‌ర్ వివాహానికి హాజ‌రైన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. రెండ‌వ వివాహం కావ‌డంతో పెళ్లి సింపుల్ గా జ‌రిగిపోయింద‌ని…రాజుగారితో పెళ్లికి అనీల్, హారీష్ వెళ్ల‌డంతో మ‌రింత చ‌ర్చ‌కు దారి తీస్తోంది. రాజుగారికి ప‌రిశ్ర‌మ‌లో కావాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, హీరోలు, టెక్నీషియ‌న్లు అంద‌రితోనూ రాజుగారు చ‌నువుగా మెలుగుతారు. వాళ్ల‌పై జోకులేంత చ‌నువు రాజుగారికి ఉండ‌నే ఉంది. అయితే పెళ్లికి వాళ్లంద‌ర్నీ ప‌క్క‌నబెట్టి కేవ‌లం హారీష్ శంక‌ర్, అనీల్ రావిపూడి ఆహ్వానించ‌డంతో రాజుగారితో వాళ్లిద్ద‌రి బాండింగ్ మిగ‌తా వాళ్ల‌కంటే బ‌లంగా ఉంద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది.

అనీల్ మంచి కామెడీ ప‌ర్స‌న్. జోకులు వేసి అంద‌ర్నీ న‌వ్విస్తుంటారు. రాజుగార్నీ అలా చాలాసార్లు న‌వ్వించాడు. ఇక అనీల్ తో వ‌రుస‌గా సినిమాలు చూస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో రాజుగారు వ్య‌క్తిగ‌తంగా వివాహానికి పిలిచిన‌ట్లు స‌మాచారం. అలాగే హారీశ్ శంక‌ర్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేసే టైమ్ లోనే రాజుగారితో స‌న్నిహితంగా ఉండేవాడుట‌. అప్ప‌టి నుంచి ఇద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం ఉంద‌ని….డైరెక్ట‌ర్ అయిన త‌ర్వాత ఆ బాండింగ్ మ‌రింత స్ర్టాంగ్ అయింద‌ని ఈ సంద‌ర్భంగా తెలుస్తోంది. అయితే పెళ్లి వేడుక‌లో అనీల్..హారీష్ శంక‌ర్ ఉన్న‌ట్లు ఫోటో రూపంలో ఎలాంటి ఆధారం లేదు.