అంతగా అంచనాలతో మొదలైన సినిమా కాబట్టే సురేందర్ రెడ్డి ఈ సినిమా కోసం చాలానే శ్రమించాల్సొచ్చింది. అయితే ఆ శ్రమకు ఫలితం దక్కనుందని మెగా కాంపౌండ్ ఎంతో జోష్ లో ఉందని తెలుస్తోంది. ఈ సినిమాపై పెట్టిన ప్రతి పైసా విజువల్ గా అద్భుతంగా కన్వర్ట్ అయ్యిందని హ్యాపీ మూడ్ లో ఉన్నారట. అంతేకాదు ఇంత అద్భుతంగా సినిమా తీసినందుకు అందుకోసం రేయింబవళ్లు శ్రమించినందుకు సురేందర్ రెడ్డికి చిత్ర నిర్మాత రామ్ చరణ్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడని తెలుస్తోంది. సూరి తన కుటుంబ సమేతంగా యూరప్, స్పెయిన్ లో పర్యటించి తిరిగి వచ్చేందుకు అవసరమైన విమానం టిక్కెట్లు, బసలు వగైరా అన్నిటినీ ప్రీబుక్ చేశారని తెలుస్తోంది. ఇన్నాళ్లు శ్రమించి ఒత్తిడిని అనుభవించినందుకు ఫుల్ రిలాక్సేషన్ ట్రిప్ ప్లాన్ చేశారట చరణ్. మొత్తానికి ఎంత హ్యాపీగా ఉండకపోతే కొణిదెల కాంపౌండ్ నుంచి ఇలాంటి ఆఫర్ దక్కుతుంది? అంటూ అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తన దర్శకులకు ఏదో రూపంలో కానుకలివ్వడం చరణ్ కి తొలి నుంచి ఉన్న అలవాటు. ఈసారి కూడా సురేందర్ రెడ్డికి అదిరిపోయే కానుక ఇస్తున్నాడన్నమాట. అక్టోబర్ 2న సైరా నరసింహారెడ్డి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
సైరా డైరెక్టర్ కి చరణ్ సర్ప్రైజ్ గిఫ్ట్
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న `సైరా: నరసింహారెడ్డి` అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేయనున్నారు. బాహుబలి, సాహో తరహాలో పాన్ ఇండియా కేటగిరీలో రిలీజవుతున్న భారీ చిత్రమిది. ఉత్తరాదిన ఈ చిత్రాన్ని అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దాదాపు 270 కోట్లు ఖర్చయిందని తాజాగా కొణిదెల కాంపౌండ్ నుంచి లీక్ అందింది. ఈ సినిమాని ట్రాయ్, గ్లాడియేటర్, ది వార్ ఆఫ్ యారోస్ రేంజులో తెరకెక్కించారని ఇదివరకూ రిలీజైన ప్రీవిజువల్స్, మేకింగ్ వీడియోలు నిరూపించాయి. అందుకే సైరా ఘనవిజయంపై రామ్ చరణ్ – చిరంజీవి బృందం ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలుస్తోంది.