మెగా బ్రదర్ నాగబాబుకు రీసెంట్ గా యూట్యూబ్ ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మై చానల్ నా ఇష్టం.. అనే టైటిల్ పెట్టి యూట్యూబ్ లో వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు. రోజుకో వీడియో పోస్ట్ చేసి వింత వింత వివాదాలు క్రియేట్ చేస్తున్నాడు. ఈ మధ్యన కూడా మరోసారి అలాంటిదే ట్రై చేసాడు. నారా లోకేష్తో పాటు ఏబిఎన్ రాధాకృష్ణను టార్గెట్ చేస్తూ ఈయన ఓ వీడియోని పోస్ట్ చేసారు. లోకేశ్ దావోస్ పర్యటనపై ఆ సెటైర్లు వేసాడు మెగా బ్రదర్.
ఆ వీడియోలో లోకేష్ ఏం చేసినా కూడా ఏబీఎన్ చానల్ భజన చేస్తుందని చెప్పేసాడు. ఆ వీడియోపై సదరు ఛానెల్ కంప్లైంట్ చేసింది దాంతో స్ట్రైక్ వేసింది. దాంతో వీడియోను యూట్యూబ్ వాడు తీయక తప్పలేదు. ఇప్పుడు అలా తీసేసిన వీడియోపై కూడా వ్యంగ్యాస్త్రాలు వేస్తున్నాడు నాగబాబు. ఇప్పుడు దీనిపైనే రచ్చ చేస్తున్నాడు.
ఆ వీడియోలో తాను కొత్తవేమీ చూపించలేదని వచ్చిన విజువల్స్ మాత్రమే చూపించానని.. కేవలం తన అభిప్రాయాన్ని చెప్పానే తప్ప.. ఎవర్నీ దూషించలేదని గుర్తు చేసాడు నాగబాబు. ఒక్క మాట ఉన్నదున్నట్లు అంటేనే అంతంత కోపాలు వస్తే.. తమ గురించి మీరెన్ని సార్లు మాట్లాడారంటూ రెచ్చిపోయాడు నాగబాబు.
అయితే పనిగట్టుకుని కొందరు కంటిన్యూగా ఈ ఛానెల్ పై కంప్లైంట్ చేద్దామని ఫిక్స్ అయ్యారని సమాచారం. కత్తి మహేష్ ని ఫేస్ బుక్, ట్విట్టర్ ల లో అప్పుడు పవన్ ఫ్యాన్స్ అంతా కంప్లైంట్ చేసిన విధంగా చేయాలని ఫిక్స్ అవుతున్నట్లు తెలుస్తోంది. అదే కనుక జరిగితే యూట్యూబ్ లో ఖచ్చితంగా నాగబాబు ఛానెల్ కు ఇబ్బందులు తప్పవు. మరి వీటిని ఎలా ఎదుర్కొబోతున్నారో నాగబాబు చూడాలి.