బిగ్ న్యూస్ : “బింబిసార” ఈవెంట్ లో జరిగిన ఘటనపై విషాద క్లారిటీ..!

ఈరోజు తెల్లవారు తోనే టాలీవుడ్ లో షాకింగ్ ఘటన అంటూ ఓ వార్త అయితే బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా భీమ్లా నాయక్ నటి సంయుక్త మీనన్ అలాగే మరో హీరోనే క్యాథరిన్ లు హీరోయిన్స్ గా కొత్త దర్శకుడు వశిస్ట తెరకెక్కించిన బీహార్ బడ్జెట్ చిత్రం “బింబిసార”.

అయితే ఈ సినిమాపై గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మేకర్స్ నిన్ననే హైదరాబాద్ లో ఎంతో ఘనంగా చేశారు. పైగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాకి గెస్ట్ గా హాజరు కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా భారీ స్థాయిలో హాజరయ్యారు. ఇక ఇదిలా ఉండగా ఈ ఈవెంట్ లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది అని ఎవరినో హాస్పిటల్ లో అడ్మిట్ చేసారని పలు వార్తలు వచ్చాయి.

అయితే ఆఖరికి ఈ వార్తల్లో విషాదమే మిగిలినట్టుగా చిత్ర నిర్మాతలు మేకర్స్ తెలియజేసారు. నిన్న ఈ ఈవెంట్ కోసం వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన పుట్ట సాయి రామ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడని మాకు తెలిసింది అని ఈ షాకింగ్ ఘటనతో మా హృదయం ముక్కలయింది అని..

మా చిత్ర యూనిట్ సహా నందమూరి ఆర్ట్స్ సాయి రామ్ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేసారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇది ఒక తీవ్ర విషాదం అనే చెప్పాలి.