తిత్లీ బాధితులకు బాలయ్య, మహేష్ విరాళం

తిత్లీ తుపాను బాధితుల సహాయం కోసం తెలుగు సినిమా పరిశ్రమలోని   హీరోలు ముందుకు వస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లా, పరిస ప్రాంతాలు తిత్లీ  దెబ్బకు అతలాకుతలమయ్యాయి. నిస్సహాయ  స్థితిలో  అక్కడి ప్రజలు సహాయ సహకారాల కోసం  ఎదురు చూస్తున్నారు. వారి బాధలు వర్ణనాతీతం. సర్వం  కోల్పోయారు. బాధితులను ఆదుకోవడాని తెలుగు దేశం పార్టీ నాయకుడు, హీరో బాలకృష్ణ తన వంతు
సహాయంగా 25 లక్షల రూపాయలను  ప్రకటించాడు.

హీరో మహేష్ బాబు కూడా అక్కడి ప్రజల అవసరాల కోసం 15 లక్షల రూపాయలను ముఖ్య మంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్టు ప్రకటించారు.
వీరి బాటలోనే మరికొంత మంది కూడా ముందుకు వచ్చి బాధితుల కోసం విరాళాలు ప్రకటించ వచ్చు.