మెగా స్టార్ కు కుటుంబ సభ్యుల ముందు అవమానం

మెగాస్టార్ చిరంజీవికి తన కుటుంబ సభ్యుల మధ్యనే ఘోర అవమానం జరిగింది . శుక్రవారం నాడు చిరంజీవి తన శ్రీమతి సురేఖ , కుమారుడు రామ్ చంరణ్, కోడలు ఉపాసన  వారి ఇంటి సమీపంలోని ఓబులు రెడ్డి స్కూల్ కు వెళ్లారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి . అక్కడ అప్పటికే భారీ సంఖ్యలో ఓటర్లు  క్యూ లో నుంచున్నారు .

రామ్ చరణ్, ఉపాసన అందరిలాగే వెళ్లి క్యూలో నుంచున్నారు . చిరంజీవి తన శ్రీమతి సురేఖను రమ్మని నేరుగా క్యూలో నుంచోకుండా ఓటింగ్ గదిలోకి వెళ్లబోతున్నాడు .

క్యూ లో వున్న ఇద్దరు కుర్రోళ్ళు మెగా స్టార్ ను ఆపి “క్యూలో రాకుండా ఇదేం పద్దతి ” అని నిలేచారు . ఈ హఠాత్ పరిణామం ఊహించలేదు . అందుకే చిరంజీవి ఎదో చెప్పబోయాడు .

“ఇక్కడ అందరు సమానమే , దయ చేసి క్యూలో రండి ” అని వారు మెత్తగా చిరంజీవికి క్లాస్ పీకారు . చిరంజీవి చేసేది లేక తన శ్రీమతి తో కలసి క్యూలో నిలబడి మరీ ఓటేశారు . ఓటారా ? మజాకా ?