మ‌సాలా మిస్ట‌రీ విప్పేసిన అంజ‌లి

విక్ట‌రీ వెంక‌టేష్‌-రామ్, అంజ‌లి, షాజ‌న్ పంద‌సీ నాయకానాయిక‌లుగా  తెర‌కెక్కిన మ‌సాలా చిత్రం గురించి తెలిసిందే. ఓ బాలీవుడ్ సినిమా రీమేక్ గా తెర‌కెక్కిన ఇందులో వెంకీకి జోడీగా అంజ‌లి న‌టించింది. మ‌ల్టీస్టార‌ర్ గా తెర‌కెక్కిన సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లై చతికిల ప‌డిన సంగ‌తి తెలిసిందే.  అయితే ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో అంజ‌లి ఆన్ సెట్స్ నుంచి మిస్ అయిందన్న వార్త అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. అప్ప‌టివ‌ర‌కూ సెట్ లో క‌నిపించిన అంజ‌లి ఒక్క‌సారిగా ఎవ‌రికీ చెప్ప‌కుండా క‌నిపించ‌కుండా పోయింది. దీంతో యూనిట్ స‌హా అభిమానులు టెన్ష‌న్ ప‌డ్డారు. మీడియాలో క‌థ‌నాలు వెడెక్కించాయి.

ఇంటికి వెళ్ల‌లేదు. చెన్నై లోనూ క‌నిపంచ‌లేదు. దీంతో అంజ‌లి ఎటు వెళ్లిపోయిందంటూ సోష‌ల్ మీడియాలో  ర‌క‌ర‌కాల క‌థ‌నాలు. కొన్ని మీడియా సంస్థ‌లు అంజ‌లి సీక్రెట్ గా పెళ్లి చేసుకుంద‌ని ప్ర‌చారం చేసాయి. దీంతో అభిమానులు గంద‌ర‌గోళానికి గుర‌వ్వాల్సి వ‌చ్చింది. త‌ర్వాత అన్ని కుదురుకున్నాక‌ సినిమా ప్ర‌చారం  స‌మ‌యంలోనూ అమ్మ‌డు క‌నిపించలేదు. యూనిట్ అంతా ప్ర‌చారంలో పాల్గొంది గానీ అంజ‌లి మాత్రం అక్క‌డా మిస్ అయింది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ ఎంత‌? అన్న దానిపై అంజ‌లి ఇప్ప‌టివ‌ర‌కూ ఎక్క‌డా వెల్ల‌డించ‌లేదు.

తాజాగా ఈ కాంట్ర‌వర్సీ పై ఓ షోలో  పెద‌వి విప్పింది. నేను ఎవ‌రి కోసం వెళ్ల‌లేదు. నా కోసం నేను వెళ్లా. నాకు విశ్రాంతి తీసుకోవాల‌నినిపించింది. అప్ప‌టికే  మాన‌సికంగా బాగా దెబ్బ‌తిని ఉన్నా. ఎన్నో ఎత్తు ప‌ల్లాలు. బాగా ఒత్త‌డికి గుర‌య్యాను. ఆ స‌మ‌యాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక‌పోయా. వాటికి తోడు కుటుంబ స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. దీంతో విశ్రాంతి కోసం ఎవ‌రికీ చెప్పుకుండా వెళ్లిపోయాను. అయితే నేను ఎవ‌డితోనే వెళ్లిపోయాన‌ని! కొన్ని వెబ్ సైట్లు అదే ప‌నిగా రాసాయి. అలాంటిదేమి  లేద‌ని న‌వ్వేసింది అంజ‌లి.