వెబ్ సిరీస్ లో అక్షర హసన్ !

నటి అక్షరహాసన్‌కు కథానాయకిగా నటించే అవకాశం వచ్చింది. వెబ్ సిరీస్ లో అయితే అది సినిమాలో కాదు. వెబ్‌ సిరీస్‌లో. నేడు వెబ్‌ సిరీస్‌లు సినిమాలకు ధీటుగా నిర్మాణం జరుగుతున్నాయి. కాజల్‌ అగర్వాల్‌ లాంటి టాప్‌ హీరోయిన్లు కూడా వెబ్‌ సిరీస్‌ వైపు దృష్టిసారిస్తున్నారు. శ్రుతీహాసన్‌ సైతం ఇటీవల ఓ హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌కు సై అంది. అక్షరహాసన్‌ తమిళ వెబ్‌ సిరీస్‌లో నటించబోతోంది అంతే తేడా. ఈ వెబ్‌ సిరీస్‌ ద్వారా నవ దర్శకుడు శివశంకర్‌ పరిచయం కానున్నాడు. ఇందులో నటి అక్షరహాసన్‌తో పాటు నటి సునైనా, గాయత్రి నటిస్తున్నారు. దీన్ని దర్శకుడు విష్ణువర్ధన్‌ నిర్మించడం విశేషం. ఈయన ఇంతకు ముందు అరిందుమ్‌ అరియామలుమ్, అజిత్‌ హీరోగా ఆరంభం, బిల్లా వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. కాగా అక్షరహాసన్‌ నటిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ సెల్‌ఫోన్‌ ఇతి వృత్తంతో సాగే సస్పెన్స్, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనుందని సమాచారం. మరి ఈ వెబ్‌ సిరీస్‌ అక్షరహాసన్‌ కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడుతుందో చూడాలి.