సుకుమార్, అల్లు అర్జున్ చిత్రం షాకింగ్ అప్డేట్

సుకుమార్, అల్లు అర్జున్ చిత్రం షాకింగ్ అప్డేట్

అందరి అంచనాలు, స్పెక్యులేషన్స్ ని తలక్రిందులు చేయబోతున్నారు అల్లు అర్జున్. ఆయన సుకుమార్ తో అనుకున్న ప్రాజెక్టు గురించి ఇక బెంగపెట్టుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే వచ్చే నెలలలోనే ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుందని సమాచారం. శ్రావణ మాసంలో ఈ ప్రాజెక్టు అఫీషియల్గా ప్రారంభం కానుంది. అయితే ఇంకా ఫలానా తేదీ అని ముహూర్తం ఫిక్స్ చేయలేదు. సెప్టెంబర్ నుంచి మాత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.

ఇప్పటికే అల్లు అర్జున్ పూర్తి నేరేషన్ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. బౌండెడ్ స్క్రిప్టుతో సుకుమార్ రంగంలోకి దూకపోతున్నారు. రంగంస్దలం ను మించిన హిట్ కోసం ఆయన రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రంతెరకెక్కనుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ని ఇప్పటివరకూ చూపించని విధంగా సుకుమార్ చూపించబోతున్నారు.

రష్మిక హీరోయిన్ గా నటించే ఈ చిత్రానికి ఎప్పటిలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. మైత్రీ మూవి మేకర్స్ వారు భారీగా ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఇక ఈ చిత్రం తర్వాతే వేణు శ్రీరామ్ సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాకు కూడా స్క్రిుప్టు వర్క్ దిల్ రాజు ఆఫీస్ లో జరుగుతోంది. ఐకాన్ అనే టైటిల్ తో రూపొందే ఈ చిత్రం ఓ విభిన్నమైన పాయింట్ తో తెరకెక్కనుంది.