హాట్ టాపిక్ : అల్లు అర్జున్ రాయబారం ఫలిస్తుందా?

కళాకారులు సున్నిత మనస్కులై ఉంటారు. చిన్న చిన్న విషయాలకే అలుగుతూంటారు. మధ్యలో ఎవరో ఒకరు ఇనేషియేషన్ తీసుకుంటే అన్ని సర్దుకుంటాయి. ఇప్పుడు అలాంటి అలకలాంటిదే త్రివిక్రమ్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మధ్య ప్రస్తుతం నడుస్తోందని చెప్తూంటారు. సన్నాఫ్ సత్యమూర్తి టైమ్ లో ఓ పాట విషయంలో ఇద్దరి మధ్య వచ్చిన చిన్న డిస్కషన్..పెద్దదైందని, మాట మాత్రం కూడా అనుకోకుండా ఇద్దరూ సైడ్ అయ్యిపోయారని చెప్పుకుంటున్నారు. అయితే త్రివిక్రమ్ ఆ మధ్యన అబ్బే..అసలు మా మధ్య ఎలాంటి క్లాష్ రాలేదు, కేవలం వేరే సంగీత దర్శకులతోనూ చెయ్యాలనే ఆలోచనతోనే తమన్ తో లేదా వేరే సంగీత దర్శకులతోనూ ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.

అయితే ఇప్పుడు వీళ్లిద్దరి విభేధం..అల్లు అర్జున్ దగ్గరకు వచ్చింది. ఎందుకంటేఅల్లు అర్జున్ సినిమా అంటే ఖచ్చితంగా ..దేవిశ్రీప్రసాద్ ఉండాల్సిందే. ఇద్దరి మధ్యా ఎన్నో సూపర్ హిట్స్ వచ్చాయి. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ తో సినిమా చేద్దామనుకుంటున్నప్పుడు దేవి ని డీల్ చేయటం ఓ సమస్యగా కనిపించింది. దాంతో ఇప్పుడు మధ్యా చిన్న రాయబారం సీన్ క్రియేట్ చేసి,కలిపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇక వక్కంతం వంశీ దర్శకత్వంలో చేసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తో షాక్‌ తిన్న అల్లు అర్జున్‌ కొత్త సినిమాను ప్రారంభించేందుకు చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. ఈ చిత్రం రిలీజ్‌ అయి చాలా రోజులు అవుతున్నా బన్నీ ఇంత వరకు కొత్త సినిమాను ప్రకటించలేదు. తమిళ దర్శకుడు లింగుసామితో ఒక సినిమా, విక్రమ్‌ కుమార్‌తో మరో సినిమా చర్చల దశలో ఉన్నా ఏ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. అవి ఫైనలైజ్ చేయలేదు.

అయితే తాజాగా అల్లు అర్జున్‌ ఓ రీమేక్‌ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా బాలీవుడ్‌లో రిలీజ్‌ అయిన సోను కే టిటు కీ స్వీటీ సినిమాను బన్నీ తెలుగులో చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈలోగా దేవితో మ్యాటర్ సెటిల్ చేస్తారు.