మూడు సినిమాలు ఒకేసారి.. భావోద్వేగంలో బన్నీ

Allu Arjun About Ala vaikunthapurramuloo

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. తన సినిమాలను తానే చూసుకుని మురిసిపోయాడు. అది కూడా మూడు వేర్వేరు చానెల్స్‌లో మూడు సినిమాలను ఒకే సారి చూస్తూ తన్మయత్వానికి గురయ్యాడు. ఈ మేరకు బన్నీ తన సంతోషాన్ని సోషల్ మీడియాలో వ్యక్తపరిచాడు. నిన్న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా మూవీ ఆఫ్ ది ఇయర్ అనిపించుకున్న అల వైకుంఠపురములో చిత్రాన్ని మొదటి సారిగా జెమినిలో ప్రసారం చేశారు.

Allu Arjun ABout World Tv Premiere Ala vaikunthapurramuloo
Allu Arjun ABout World Tv Premiere Ala vaikunthapurramuloo

ఇక మొదటి సారిగా ప్రసారం చేస్తుండటంతో బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ సందడి చేశారు. నిన్న సాయంత్రం మొత్తం అల వైకుంఠపురములో హంగామాయే నడిచింది. పూజా హెగ్డే, సుశాంత్, గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్, బన్నీ అందరూ కూడా అల వైకుంఠపురుములో గురించి ప్రమోట్ చేశారు. టీవీలో సినిమాను చూస్తూ సంబరపడిపోయారు. ఇక ఇదే క్రమంలో స్టార్ మా, జీ తెలుగులో బన్నీ సినిమాలు ప్రసారమయ్యాయి.

డీజే, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలు ఒకే సమయానికి ప్రసారమయ్యాయి. ఇక ఇదే విషయాన్ని బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వాటే కో ఇన్సిడెన్స్.. టీవీలో ఒకే సమయాన్ని నా మూడు చిత్రాలను చూడటం ఎంతో ఆనందంగా ఉంది అంటూ సంతోషాన్ని పంచుకున్నాడు. ఇక బన్నీ ప్రస్తుతం పుష్ప సినిమా కోసం మరింత స్టైలీష్ అండ్ రా లుక్‌లోకి మారిపోతున్నాడు. ఈ మధ్యే నిహారిక నిశ్చితార్థంలో బన్ని స్పెషల్ అట్రాక్షన్‌గా మారిన సంగతి తెలిసిందే.