‘మిస్ట‌ర్ మ‌జ్ను’గా అఖిల్ అక్కినేని..

                                                                  (ధ్యాన్)

అక్కినేని అఖిల్ ఇప్పుడు త‌న మూడ‌వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గానే సినిమా లండ‌న్‌లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. తొలిప్రేమ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ల‌వ్ అండ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌బోయే ఈ చిత్రానికి `మిస్ట‌ర్ మ‌జ్ను` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో నాగార్జున న‌టించిన సూప‌ర్‌హిట్ చిత్రం మ‌జ్ను టైటిల్‌నే ఈ సినిమాకు ప‌రిశీలిస్తున్నారంటున్నారు. ఈ చిత్రాన్ని బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.