అఖిల్ సినిమా టైటిల్ ఖరారు …

అఖిల్ తన మూడవ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే చాల వరకు చిత్రీకరణ జరుపుకుంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి ‘మిస్టర్ మజ్ను’ అనే టైటిల్ ను పరిశీలిస్తూ వస్తున్నారు. మంచి ఫీడ్ బ్యాక్ రావడంతో ఇదే టైటిల్ ను ఖరారు చేశారనేది తాజా సమాచారం. త్వరలోనే  ఈ టైటిల్ ను అధికారకంగా ప్రకటించునున్నారట.

ఈ సినిమా అఖిల్ జోడిగా నిధి అగర్వాల్ నటిస్తోంది. గతంలో వెంకీ అట్లూరి నుంచి వచ్చిన ‘తొలిప్రేమ’ ఘన విజయాన్ని సాధించింది. దాంతో సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంతకు ముందు అఖిల్ నుంచి రెండు భారీ సినిమాలు వచ్చిన అవి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకలేకపోయారు. అందువలన ఈ సారి తనకి తప్పకుండ హిట్ పడాలనే పట్టుదలతో అఖిల్ ఉన్నాడు.