‘మిస్టర్ మజ్ను’..నీ అసలు మ్యాటర్ ఇదా?

‘‘అఖిల్, హలో’’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి  అక్కినేని అఖిల్ చేస్తున్న తాజా సినిమా ‘మిస్టర్ మజ్ను’. మీడియాలో  ప్రచారంలో ఉన్న ఈ టైటిల్‌నే కన్ఫర్మ్ చేస్తూ రీసెంట్ గా చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్ విడుదల చేసింది చిత్రయూనిట్.  49 సెకనుల నిడివితో విడుదలైన ఈ టీజర్.. ‘‘దేవదాసు మనవడు.. మన్మధుడికి వారసుడు..కావ్యంలో కాముడో.. అంతకన్నా రసికుడో..’’ అంటూ మొదలై అక్కినేని అభిమానులను ఆకట్టుకుంటోంది.

 అయితే అదే సమయంలో ఈ చిత్రం పాత ఏఎన్నార్ సూపర్ హిట్ ప్రేమనగర్ ని బేస్ చేసుకునిఈ కాలానికి తగినట్లుగా అల్లిన కథ అంటూ మీడియాలో ప్రచారం మొదలైంది. ప్లే బోయ్ గా జీవితాన్ని ఎంజాయ్ చేసే ఓ కుర్రాడు ప్రేమలో పడి…విలువ తెలుసుకుని మారిన మనిషిగా ప్రేమ కోసం ఎలా తపించాడు అనే పాయింట్ చుట్టూ తిరుగుతుందని అంటున్నారు.

అయితే హీరో ప్లే బోయ్ కాన్సెప్టు..ఇలా ప్రేమ కోసం మారటం అనేది ఆ మధ్యన వెంకటేష్ సైతం ..ప్రేమించుకుందాం రా అంటూ చేసేసాడు. అయితే ఆ సినిమా ఎక్కలేదు. వెంకటేష్ ఇమేజ్ కు ప్లే బోయ్ క్యారక్టరైజేషన్ సెట్ కాలేదు అన్నారు. ఇప్పుడు అఖిల్ కుర్రాడు కాబట్టి..ఈ జనరేషన్ కు తగిన ప్లే బోయ్ సీన్స్  తో మిక్స్ చేసి సినిమా కథ వండారంటున్నారు. ఏదైతేనేం ఈ  చిత్రానికి సంబంధించి మొట్టమొదటగా వచ్చిన ఈ టీజర్ తోనే ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చేశారు యూనిట్ సభ్యులు.

‘తొలి ప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.