బాలకృష్ణ ‘ఆదిత్య 369’ వచ్చి అప్పుడే 27 ఏండ్లు అయిందా?

నందమూరి బాలకృష్ణ, మోహినీ జంటగా నటించిన  సింగీతం శ్రీనివాస్ రావు హిట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369 వచ్చి  ఈ రోజు 27 సంవత్సరాలు. శ్రీదేవి మూవీ స్ కృష్ణ ప్రసాద్ అందించిన ఈ చిత్రం 27 సంవత్సాల కిందట  జూలై 18న 1991న విడుదలయింది. ఆ రోజుల్లో పిల్లలను విశేషంగా ఆకట్టు కున్న ఈ  చిత్రానికి ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఇలాంటి చిత్రం భారతదేశంలో తయారుకావడం ఇదే మొదటిదని పేరొచ్చింది. రు. 1.6 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 9.6 కోట్లు వసూలు చేసిందని చెబుతారు.