రాజశేఖర్ విరాళం 10 లక్షలు

తిత్లీ  తుపాన్ బాధితుతుల సహాయార్థం డాక్టర్ రాజశేఖర్ , జీవిత  10 లక్షల విరాళాన్ని ముఖ్య మంత్రి సహాయ నిధికి  అందజేశారు. ఇటీవల వరదల వల్ల శ్రీకాకుళం  అపారంగా నష్టపోయింది . నిరాశ్రయులైన వారిని ఆదుకోవడానికి డాక్టర్ రాజశేఖర్ , జీవిత  ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడును కలసి 10 లక్షల రూపాయల చెక్  అందించారు .

అదే సందర్భంలో  భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ కూడా చంద్ర బాబు నాయుడును కలసి వరద భాదితులకు 10 లక్షల రూపాయలను ముఖ్య మంత్రి  సహాయ నిధికి అందించారు . డాక్టర్ రాజశేఖర్ , జీవిత దంపతులను , వి. ఆనంద్ ప్రసాద్ ను చంద్ర బాబు అభినందించారు .