కాకినాడలో సందడి చేస్తున్న #AA 19 చిత్ర బృందం

అల్లు అర్జున్ గతేడాది ‘నా పేరు సూర్య’ చిత్రం తరువాత మళ్ళీ కొంచెం విరామం తీసుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు. ‘నా పేరు సూర్య’ ఫలితం తేడా కొట్టేసరికి స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని అది వరకు తనకు రెండు హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ ను నమ్ముకున్నాడు.

ప్రస్తుతం వీరి కలయికలో అర్జున్ 19 వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అధిక భాగం కాకినాడలో జరగనుంది. ఇప్పటికే అల్లు అర్జున్ కాకినాడ చేరుకోగా ఆయన అభిమానులు ఆయనకు సాదర స్వాగతం పలికారు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుండగా ఇతర పాత్రల్లో టబు, సుశాంత్, వెన్నెల కిషోర్ మొదలైనవారు నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను త్వరలోనే ప్రకటించనున్నారు.