నందమూరి ఫ్యాన్స్ కు నచ్చే విషయం ఇంకోసారి..

బాలయ్య, ఎన్టీఆర్ కలిసి మరోసారి స్టేజిని పంచుకోబోతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘118’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలకృష్ణ , ఎన్టీఆర్ ముఖ్య అతిధులుగా రానున్నారు. ఈ మధ్యకాలంలో వీరు ముగ్గురు కలిసి స్టేజి మీద కనిపించడం ఇది మూడవ సారి కావటం విశేషం. గతంలో అరవింద సమేత , ఎన్టీఆర్ కథానాయకుడు ఈవెంట్ లకు బాలయ్య,ఎన్టీఆర్ హాజరయ్యారు. దాంతో నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

ఇక ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ లో జరుగనుంది. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

గతంలో కల్యాణ్‌రామ్‌ ఎప్పుడూ చేయని సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. షాలిని పాండే, నివేదా థామస్‌ హీరోయిన్స్. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 1 న విడుదలకానుంది. శేఖర్‌ చంద్ర స్వరాలు సమకూరుస్తున్నారు.