స్టార్ డైరెక్ట‌ర్‌తో ఆడుకుంటున్నారా?

స్టార్ డైరెక్ట‌ర్‌తో ఆడుకుంటున్నారా?

టాలీవుడ్‌లో హిట్‌కే విలువ ఎక్కువ‌. అది లేక‌పోతే ఎంత ప‌రిచ‌యాలు వున్నా..ఎంత ఆప్త మిత్రులైనా ముఖం చాటేస్తుంటార‌న్న‌ది చాలా సంద‌ర్భాల్లో రుజువైంది. ప్ర‌స్తుతం ఇలాంటి ప‌రిస్థితినే స్టార్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ఎదుర్కొంటున్నాడు. ఇటీవ‌ల మ‌హేష్ హీరోగా `మ‌హ‌ర్ష‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించాడు. అయినా స‌రే అత‌నికి నెక్ట్స్ సినిమా సెట్ కావ‌డం లేదు. ఏ హీరో కూడా ఓకే చెప్ప‌డం లేదు.

`స‌రిలేరుకు నీకెవ్వ‌రు` రిలీజ్‌కు ముందు వంశీ పైడిప‌ల్లితో నెక్స్ట్ ఫిల్మ్ చేస్తాన‌ని చెప్పాడు మ‌హేష్ కానీ వంశీ పైడిప‌ల్లి చెప్పిన స్క్రిప్ట్ న‌చ్చ‌క‌పోవ‌డంతో మ‌న‌సు మార్చుకుని ప‌ర‌శురామ్ చిత్రాన్ని ఓకే చేశాడు. ఆ త‌రువాత చేస్తాడా? అంటే రాజ‌మౌళితో సినిమా వుంది. దీంతో మిగ‌తా స్టార్స్‌ని క‌లిసి క‌థ చెప్పాల‌ని ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేకుండా పోయింది. చివ‌రికి త‌న ట్ర‌బుల్ షూట‌ర్ దిల్ రాజు హీరోల‌ని ఒప్పించాల‌ని చేసిన ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌లేదు.

రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌ని ప్ర‌య‌త్నిస్తే `ఆర్ ఆర్ ఆర్‌` త‌రువాత రామ్‌చ‌ర‌ణ్ `ఆచార్య‌` చేయాల్సి వుంది. ఎన్టీఆర్ త‌న 30వ చిత్రాన్ని త్రి‌విక్ర‌మ్‌తో క‌మిట్ అయ్యారు. ప్ర‌భాస్‌ని క‌దిలిద్దామంటే నాగ్ అశ్విన్ తో సినిమా ఓకే చేసుకున్నాడు. అల్లు అర్జున్ `పుష్ప‌` ఆ త‌రువాత `ఐకాన్‌` వ‌న్ బై వ‌న్ లైన్‌లో పెట్టుకున్నాడు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ వెంట‌ప‌డాల‌ని చూస్తే ప‌వ‌న్ చేతిలో వ‌రుస‌గా మూడు ప్రాజెక్ట్‌లున్నాయి. దీంతో వంశీ పైడిప‌ల్లి మ‌రి కొంత కాలం వేచి చూడ‌క త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది.