స్టార్ డైరెక్టర్ల‌కు రాజ‌మౌళి చుక్క‌లు చూపిస్తున్నాడా?

Coronavirus

బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 .. ఈ రెండు చిత్రాల‌తో టాలీవుడ్‌లో రాజ‌మౌళి స‌రికొత్త ట్రెండ్‌ని సెట్ చేశారు. దీన్ని బీట్ చేయాడం ఏ ద‌ర్శ‌కుడి వ‌ల్లా కావ‌డం లేదు. ఇదిలా వుంటే రాజ‌మౌళి ఇద్ద‌రు స్టార్ డైరెక్ట‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నాడ‌ట‌. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ఫిల్మ్ `ఆర్ ఆర్ ఆర్‌`. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్ర‌మిది. నెవ్వ‌ర్ బిఫోర్ ఎవ‌ర్ ఆప్ట‌ర్ అనే క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

దానికి ఏమాత్రం తీసిపోని స్థాయిలో సినిమా వుండ‌బోతోంద‌ని టైటిల్ లోగో మోష‌న్ పోస్ట‌ర్‌, రామ్‌చ‌ర‌ణ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ టీజ‌ర్ హిట్ ఇచ్చేశాయి. రిలీజ్‌కు ముందు బిజినెస్ ప‌రంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఈ సినిమా ట్రేడ్ వ‌ర్గాల్లో స‌రికొత్త రికార్డుల‌కు నాంది ప‌లుకుతోంది. అయితే ఈ సినిమా ఇప్ప‌డు ఇద్ద‌రు స్టార్ డైరెక్ట‌ర్ల‌కు సంక‌టంగా మారింది.

కొర‌టాల శివ‌, త్రివిక్ర‌మ్ ఈ సినిమా ఎప్పుడు పూర్త‌వుతుందా? అని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. కార‌ణం కొర‌టాల శివ ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో 30 నిమిషాలు నిడివిగ‌ల కీల‌క అతిథి పాత్రని రామ్‌చ‌ర‌ణ్ చేత చేయించాల‌ని ఫిక్స్ అయ్యారు. అయితే రాజ‌మౌళి మాత్రం `ఆర్ ఆర్ ఆర్‌` పూర్త‌యిన త‌రువాత రామ్‌చ‌ర‌ణ్‌ని అప్ప‌గిస్తాన‌ని క‌చ్చితంగా చెప్పేశాడ‌ట‌. దీంతో `ఆర్ ఆర్ ఆర్‌` ఎప్పుడు పూర్త‌వుతుందా అని కొర‌టాల శివ ఎదురుచూస్తున్నాడు.

ఇక త్రివిక్ర‌మ్‌దీ ఇదే ప‌రిస్థితి. అల్లు అర్జున్‌తో ఈ సంక్రాంతికి `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్న త్రివిక్ర‌మ్ త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని ఎన్టీఆర్‌తో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇది స్టార్ట్ కావాలంటే రాజ‌మౌళి క‌నిక‌రించాల్సిందే. `ఆర్ ఆర్ ఆర్‌` పూర్తి కానిదే ఎన్టీఆర్‌ని వ‌ద‌ల‌డు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు ఏం చేయాలో తోచ‌క త్రివిక్ర‌మ్ త‌ల ప‌ట్టుకుంటున్నాడ‌ట‌. ఇలా ఒకే సారి జ‌క్క‌న్న `ఆర్ ఆర్ ఆర్‌`తో ఇద్ద‌రు స్టార్ డైరెక్ట‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నాడ‌ని ఇండ‌స్ట్రీలో చెప్పుకుంటున్నారు.