సీఎం జ‌గ‌న్‌తో టాలీవుడ్ నిర్మాత‌ల భేటి!

ఉన్న‌ట్టుండి ఏపీ సీఎంపై టాలీవుడ్ నిర్మాత‌ల‌కు ప్రేమ పుట్టుకొచ్చింది. తాడేప‌ల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. దీని వెన‌క ఏదో పెద్ద మ‌త‌ల‌బే వుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. అయితే నిర్మాత‌లు మాత్రం ఈ భేటీ వెన‌క‌క ఎలాంటి ర‌హ‌స్యం లేద‌ని, హుద్ హుద్ తుఫాను బాదితుల స‌హాయార్థం నిర్మించిన ఇళ్ల ప్రారంభోత్స‌వం, బాధిత కుటుంబాల‌కు ఇళ్ల‌ని అంద‌జేయ‌డం వంటి కార్య‌క్ర‌మం కోసమే తాము సీఎం జ‌గ‌న్‌ని క‌లిశామ‌ని చెబుతున్నారు.

హుథ్ హుథ్ తుఫాన్ కార‌ణంగా స‌ర్వం కోల్పోయిన వారి కోసం చిత్ర ప‌రిశ్ర‌మ ప్ర‌త్యేకంగా రెండు రోజుల పాటు టెలీథాన్ పేరుతో ఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. దీని ద్వారా వ‌చ్చిన 15 కోట్ల మొత్తాన్నివెచ్చించి బాధితుల కోసం ప‌క్కా ఇళ్ల నిర్మాణం చేప‌ట్టామ‌ని దాన్ని మీరే ప్రారంభించాల‌ని వైఎస్ జ‌గ‌న్‌ని క‌లిసి విన్న‌వించామ‌ని నిర్మాత‌లు చెబుతున్నారు. వైఎస్ జ‌గ‌న్‌ని క‌లిసిన వారిలో డి. సురేష్‌బాబు, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ, న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, జెమిని కిర‌ణ్‌, శ్యామ్ ప్ర‌సాద‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. బ‌య‌టికి ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్య‌త లేద‌ని చెబుతున్నా వైజాగ్‌లో టాలీవుడ్ విస్త‌ర‌ణ కోస‌మే ఉన్న‌ప‌లంగా నిర్మాత‌ల్లో కీల‌క వ్య‌క్తులుగా చెలామ‌ని అవుతున్న నిర్మాత‌లు సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిశార‌ని టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.