సరితకు కన్నీళ్లు ఆగలేదట

ఒకప్పటి హీరోయిన్ , ఇప్పటి డబ్బింగ్  ఆర్టిస్ట్  సరితకు కన్నీళ్లు ఉబికి వచ్చాయట. సరితకు డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి పేరుంది . తెలుగులో ఇప్పుడు ఎక్కువమంది హీరోయిన్లకు డబ్బింగ్  చెబుతున్నారు .

హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పే వారు నలుగురైదుగురు వున్నా, వారిలో సరిత మొదటి స్థానంలో వుంది. బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న “ఎన్టీఆర్ బయోపిక్ ” చిత్రంలో విద్యాబాలన్  ఎన్టీరామారావు  అర్ధాగి శ్రీమతి  బసవ తారకం  పాత్రను పోషిస్తుంది .

ఈ పాత్రకు సరిత డబ్బింగ్ చెప్పడానికి హైదరాబాద్  వచ్చింది . ప్రసాద్ ల్యాబ్  ఈ చిత్రం డబ్బింగ్ జరుగుతుంది. బసవ తారకం పాత్రలో నటించిన విద్యా బాలన్  ఆ పాత్రలో ఒదిగిపోయారని , కొన్ని సన్నివేశాల్లో డబ్బింగ్ చెప్పలేక కన్నీళ్లు ఉబికి వచ్చాయని చెప్పింది.

తానూ ఎంతో మంది నాయికలకు డబ్బింగు చెప్పానని కానీ ఈ చిత్రం చూస్తూ డబ్బింగ్ చెబుతుంటే  కన్నీళ్లు ఆగలేదని తెలిపింది . తాను  సినిమాలో పూర్తిగా లీనమయ్యానని సరిత చెప్పింది. అంటే ఎన్టీఆర్ బయోపిక్ సరితను అంతగా ఆకట్టుకుందట .