సన్నిలియోన్ తో నవదీప్…శృంగారం ?

నవదీప్‌కు సూపర్ ఆఫర్.. సన్నీ పక్కన ఛాన్స్

బాలీవుడ్‌లో తొలి అడుగులోనే హాట్ స్టార్ సన్నీ లియోనీతో కలిసి పని చేయబోతున్నాడు నవదీప్. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏఎల్‌టీ బాలాజీ హిందీలో “రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్” అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఇందులో నవదీప్‌, సన్నీ లియోనీ ఎంపిక చేసారు. ఈ సందర్భంగా సెట్‌లో వీరిద్దరూ కలిసి సెల్ఫీ దిగారు. ఈ సెల్ఫీని సన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. “నవదీప్‌తో కలిసి పనిచేయబోతున్నాను. ఇలాంటి మంచి వ్యక్తితో కలిసి పనిచేయబోతున్నందుకు సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు.

ఈ పోస్ట్‌కు నవదీప్ రిప్లై ఇస్తూ.. “మై ప్లెజర్ సన్నీ. యూ ఆర్ సో ఫన్నీ” అని క్యాప్షన్ ఇచ్చాడు. “రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్” ఓ ఎరాటిక్ హారర్ సిరీస్. 2014లో “రాగిని ఎంఎంఎస్ 2” టైటిల్‌తో ఓ హారర్ సినిమా విడుదలైంది.

ఇందులో సన్నీ లియోనీ ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఇప్పుడు ఇదే టైటిల్‌తో వెబ్ సిరీస్‌ నిర్మించాలని నిర్మాత ఏక్తా కపూర్ భావిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యేలా దక్షిణాది నుంచి నవదీప్‌ను ఎంచుకున్నారు. అయితే ఈ వార్త విన్న అభిమానులు సోషల్ మీడియాలో ..వీరిద్దరి కాంబినేషన్ లో ఆ సీన్స్ ఉంటాయా..చాలా హాట్ గా ఉంటాయా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నవదీప్ ని ఎంచుకోవటం ద్వారా తెలుగు మార్కెట్ లో కూడా ఈ సీరిస్ ని హైలెట్ చేయవచ్చనేది ఏ ఎల్ టీ వారి ఆలోచన అని తెలుస్తోంది.

మరోపక్క అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న అల వైకుంఠపురంలో చిత్రంలో నవదీప్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్‌లో నవదీప్‌, సన్నీ కలిసి నటించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇందుకోసం వీరిద్దరు కలిసి పనిచేయలేదని.. రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్‌లో ఈ ఇద్దరు నటించనున్నారని స్పష్టత వచ్చేసింది.