షాలిని, రాజ్ తరుణ్ కు హిట్ ఇస్తుందా

‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలిని పాండే దిల్ రాజు బ్యానర్ లో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒక్కటే’. ఈ చిత్రం ఇప్ప‌టికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసింది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను న‌వంబ‌ర్ రెండో వారంలో విడుద‌ల చేయడానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

మిక్కీ జె.మేయ‌ర సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జీఆర్‌.కృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.ప్లాపుల లో ఉన్న రాజ్ తరుణ్ కెరీర్ ను ఈ సినిమా అయినా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.