శ‌ర్వా ఆప‌రేష‌న్ విక‌టించిందా?

యంగ్ హీరో శ‌ర్వానంద్‌కు `జాను` మర్చిపోలేని కాళ‌రాత్రుల్ని మిగిల్చింది. ఏరి కోరి మ‌రీ చేసిన సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా విఫ‌ల‌మైంది. ఫ‌లితం విష‌యంలో బాధ‌ప‌డుతున్న శ‌ర్వాకు మ‌రో ఇబ్బందిని తెచ్చిపెట్టిందీ చిత్రం. `జాను` చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో శ‌ర్వానంద్ షోల్డ‌ర్ ఫ్రాక్ష‌ర్ అయిన విష‌యం తెలిసిందే. అపోలో డాక్ట‌ర్‌ల కార‌ణంగా శ‌ర్వా కోలుకున్నాడు. ఆ త‌రువ‌త మ‌ళ్లీ షూటింగ్ చేశాడు. సినిమాని పూర్తి చేశాడు.

అయితే ఆ గాయం పూర్తిగా మాన‌లేద‌ని, అది మ‌ళ్లీ శ‌ర్వాని ఇబ్బందిపెడుతోంద‌ని తెలిసింది. దాంతో అమెరికా వెళ్లిన శ‌ర్వా అక్కడి డాక్ట‌ర్ల‌కు త‌న ప‌రిస్థితిని వివ‌రించాడ‌ట‌. ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన డాక్ట‌ర్లు ఆప‌రేష‌న్ ఖ‌చ్చితంగా చేయాల్సిందే న‌ని చెప్పేశార‌ట‌. ప్ర‌స్తుతం శ‌ర్వా త‌న షోల్డ‌ర్‌కు ఆప‌రేష‌న్ చేయించుకునే ప‌నుల్లో వున్నాడు. ఆప‌రేష‌న్ త‌రువాత కొంత విశ్రాంతి తీసుకున్నాకే `శ్రీ‌కారం` చిత్రానికి సంబంధించిన బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేయాల‌నుకుంటున్నాడ‌ట‌.