వ‌ణికిపోతున్న నాగార్జున టీమ్‌!

కింగ్ నాగార్జున‌తో స‌ని చేస్తున్న కొత్త టీమ్ వ‌ణికిపోతోంది. భ‌యంతో కీల‌క షెడ్యూల్‌నే వాయిదా వేసింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. `మ‌న్మ‌థుడు -2` ప్ర‌యోగం మెడిసికొట్ట‌డంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ నాగార్జున కొంత విరామం తీసుకుని `వైల్డ్ డాగ్‌` సినిమాతో మ‌ళ్లీ స్పీడు పెంచేశారు. కొర‌టాల శివ స్నేహితుడు నిరంజ‌న్‌రెడ్డి మ‌రో నిర్మాత‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ జెట్ స్పీడుతో సాగుతోంది. 2009లో హైద‌రాబాద్‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

అషిషోర్ సాలొమ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రంలో నాగార్జున ప‌వ‌ర్‌ఫుల్ ఎన్ ఐ ఏ ఆఫీస‌ర్‌గా ప‌టిస్తున్నారు. నాగ్‌కు జెడీగా బాలీవుడ్ భామ దియా మీర్జాని ఎంపిక చేసుకున్నారు. ఇంకా షూటింగ్‌లో పాల్గొన‌లేదు. ఆమెతో పాటు `రేయ్‌` ఫేమ్ స‌యామీఖేర్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఇందులో ఆమె రా ఏజెంట్‌గా క‌నిపిస్తుంద‌ట‌. పాత్ర కోసం ఇటీవ‌లే మిక్స్డ్ మార్ష‌ల్ ఆర్ట్స్‌ని కూడా నెల రోజుల పాటు ప్ర‌త్యేక శిక్ష‌ణ కూడా తీసుకుంది.

థాయ్‌లాండ్‌లో స‌యామీకి సంబంధించిన యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో పాటు కీల‌క షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు. అయితే ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌ల్ అక్క‌డ విజృభిస్తోంద‌ని వార్త‌లు రావ‌డంతో టీమ్‌తో వెళ్లి రిస్క్ చేయ‌డం ఎందుక‌ని అర్థాంత‌రంగా షూటింగ్‌ని వాయిదా వేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. షెడ్యూల్ మార‌డం వ‌ల్ల నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్ట‌మే అంటున్నారు. నాగ్ టీమ్ మాత్రం ఇలాంటి ప‌రిస్థితుల్లో థాయ్‌లాండ్‌కా అని వ‌ణికిపోతున్నార‌ట‌.