ర‌చ్చకెక్కి హ‌ద్దులు దాటుతున్న మహేష్ ఫ్యాన్స్‌!

ర‌చ్చకెక్కి హ‌ద్దులు దాటుతున్న మహేష్ ఫ్యాన్స్‌!

టాలీవుడ్‌లో ఒక హీరో సినిమా రిలీజ్ అవుతోంటే మ‌రో హీరో ఫ్యాన్స్ చేసే ర‌చ్చ ఈ మ‌ధ్య తారా స్థాయికి చేరుతోంది. ఈ సంక్రాంతికి ఇద్ద‌రు స్టార్ హీరోలు మ‌హేష్ నటించిన `సరిలేరు నీకెవ్వ‌రు`, అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పురములో` చిత్రాలు విడుద‌ల‌య్యాయి.

ఈ స‌మ‌యంలో ఇద్ద‌రు హీరోల అభిమానుల మ‌ధ్య‌ మామూలు ర‌చ్చ జ‌ర‌గ‌లేదు. ఒక హీరో సినిమాని తొక్కెయ్యాల‌ని మ‌రో హీరో వ‌ర్గం భారీగానే ప్లాన్‌లు చేసింది. యూట్యూబ్‌ల‌ని మ్యానేజ్ చేస్తూ గంట గంటికి మ‌హేష్ సినిమాపై నెగెటివ్ స్టోరీస్ చేస్తూ సోష‌ల్ మీడియా, యూట్యూబ్‌లో వైర‌ల్ అయ్యేలా చేశారు.

ఇది ప‌క్క‌న పెడితే తాజాగా త‌మిళ హీరో ఫ్యాన్స్‌కి, తెలుగు హీరో మ‌హేష్ ఫ్యాన్స్‌కి మధ్య ట్విట్ట‌ర్ వార్ మొద‌లైంది. ఏ స్థాయిలోకి వీరి గొడ‌వ దిగ‌జారిందంటే మ‌హేష్‌ని డ‌మ్మీ స్టార్ అనేంత‌గా వీరి మ‌ధ్య వార్ దిగ‌జారింది. దీంతో మ‌హేష్ ఫ్యాన్స్ కూడా స‌హ‌నం కోల్పోయి త‌మిళ హీరో విజ‌య్‌ని రీమేక్ చిత్రాల స్టార్ అంటే ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు.

సోష‌ల్ మీడియాలో ఈ ఇద్ద‌రు హీరోల ఫ్యాన్స్ డ‌మ్మీస్టార్ మ‌హేష్, రీమేక్ స్టార్ విజ‌య్ అనే హ్యాష్ ట్యాగ్‌ల‌తో ర‌చ్చ చేశారు. అస‌లు వీరి మ‌ధ్య వార్ ప్రారంభం కావ‌డానికి కార‌ణం ఏంటీ? అంటే స‌మాధానం లేదు. ఎవ‌రు ముందు మొదలు పెట్టార‌న‌డానికి కూడా ఆధారం లేదు. దీంతో నెటిజ‌న్స్ ఈ వారేంట్రా బాబు అని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.