రౌడీ హీరో పారితోషికం తిరిగిచ్చేశాడా?

విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ త‌గ్గుతోందా? అంటే ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. ఇటీవ‌ల వ‌రుస ఫ్లాపుల్ని ఎదుర్కొంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` చిత్రంలో భారీ డిజాస్ట‌ర్‌ని ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా దాదాపు నిర్మాత కె.ఎస్‌. రామారావుకు 20 కోట్ల న‌ష్టాన్ని తెచ్చిపెట్టిన‌ట్టు తెలుస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్నిబ‌య్య‌ర్స్ భారీ మొత్తాలు చెల్లించి సొంతం చేసుకున్నారు.

కానీ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా ఫ్లాప్ కావడంతో ఇప్ప‌డు ఆ నష్టాల్ని భ‌రించ‌మ‌ని నిర్మాత వెంట‌ప‌డుతున్నార‌ట‌. నితిన్ న‌టించిన `భీష్మ‌` రిలీజ్ త‌రువాత `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` ప‌రిస్థితి మరింత దారుణంగా త‌యారైంది. దీంతో దాదాపు స‌గం థియేట‌ర్ల నుంచి ఈ సినిమాని తీసేశారు. డ‌స్ట్రిబ్యూట‌ర్స్ ఇప్పుడు త‌మ ప‌రిస్థితేంట‌ని నిర్మాత‌ని గ‌ట్టిగా నిల‌దీస్తున్నార‌ట‌. ఈ ప‌రిస్థితి కార‌ణంగా త‌న `ఫైట‌ర్‌` సినిమా ఇడ్డందుల్లో ప‌డ‌కూడ‌ద‌ని భావించిన విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న రెమ్యున‌రేష‌న్‌లో స‌గం నిర్మాతకు తిరిగి ఇచ్చేసిన‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది.