రాజ్ తరుణ్ కొత్త సినిమా ‘ఒరేయ్ బుజ్జిగా’ ప్రారంభం

చూడడానికి పక్కింటి కుర్రాడి వాటం, మాటేమో అచ్చ తెలుగు మాదిరి ఆహార్యంతో ఉంటాడు యువ కధానాయకుడు రాజ్ తరుణ్. అయితే పాపం అతను సరిగా కధలు ఎంచుకోకపోవడం వల్ల అతను చేసిన సినిమాలు అతని కెరీర్కేమీ ఉపయోగపడలేదు. దాంతో ఇప్పుడు ఆ తప్పును సరి చేసుకునే ప్రయత్నంలో పడ్డాడు. తాజాగా తన తదుపరి చిత్రం వివరాలు బయట పెట్టాడు.

శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ ప్రముఖ నిర్మాత రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ దర్శకుడు కొండా విజయ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ నిన్న ప్రారంభం అయింది. ఈ చిత్రానికి టైటిల్ ‘ఒరేయ్ బుజ్జిగా’ అని తెలిపారు చిత్ర బృందం.

ఈ సారైనా ఈ యువ హీరో కి విజయం వరిస్తుందేమో చూద్దాం.