రాగల 24 గంటల్లో ఆమెను బికినీలో చూస్తాం..!!

గ్లామర్ గేట్లు ఎత్తిసి….బికీనీతో రచ్చ .!!

తెలుగు అమ్మాయిలు కాస్తంత రిజర్వ్ గా ఉంటారని, వారితో సినిమాకు అవసరమైన గ్లామర్ ప్రదర్శన చేయించటం కష్టమని దర్శక,నిర్మాతలు వాపోతూంటారు. అందుకే తాము తెలుగు అమ్మాయిలను హీరోయిన్స్ గా ప్రమోట్ చేయమని చెప్పేస్తూంటారు. ఈ మాటలు తెలుగు అమ్మాయి ఈషారెబ్బా విన్నట్లుంది. ఇన్నాళ్లూ పద్దతిగా అందాల ప్రదర్శన చేసిన ఆమె ఇక గ్లామర్ గేట్లు ఎత్తేయాలని ఫిక్సైంది. ఆమె మరెవరో కాదు ఈషా రెబ్బ.

అంతకు ముందు ఆ తరువాత వంటి సినిమాలో నటించిన ఈషా రెబ్బాకు ఆ తర్వాత అదిరిపోయే అవకాశాలు వస్తాయని అనుకుంది. ఆఫర్స్ అయితే వచ్చాయి కానీ అవేమీ ఆమెకు పనికొచ్చేవి కావు..ఏవో చిన్న చితకావి. పెద్ద ఆఫర్స్ దొరకలేదు. ఈ టైమ్ లో ఎన్టీఆర్ అరవింద సమేత వచ్చింది. పాత్ర చిన్నదే కానీ పెద్ద హీరో సినిమా ఒప్పుకుని చేసింది. సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. అయినా తన పరిధిమేరకు నటించి మెప్పించింది. ఈ మూవీ తరువాత ఆఫర్స్ వస్తాయని ఎదురు చూసింది.

ఆ తర్వాత చేసిన సుబ్రమణ్యపురం సినిమా హిట్ టాక్ వచ్చినా… ఉపయోగం లేదు. దాంతో తాను గ్లామర్ ప్రదర్సన చేయగలనని గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విధంగా ఫొటో షూట్స్ వదిలింది. దాంతో ప్రస్తుతం ఈ భామ తెలుగులో రాగల 24 గంటల్లో సినిమా చేస్తున్నది. శ్రీనివాస్ రెడ్డి దర్శకుడు. ఇప్పటికే గ్లామర్ ఫోటో షూట్ లతో ఆకట్టుకుంటున్న ఈ హీరోయిన్, గ్లామర్ గేట్లు ఎత్తేసేందుకు సిద్ధం అయ్యింది.

రాగల 24 గంటల్లో సినిమాలో బికినీ వేసుకొని నటించేందుకు సిద్ధం అయ్యింది. ఓపెనింగ్ సీన్ ను స్విమ్మింగ్ పూల్ లో చిత్రీకరించాలని అనుకుంటున్నారట. ఈ షాట్ ను ఎదో పెట్టినట్టుగా కాకుండా సినిమాలో అంతర్భాగంగా చిత్రీకరించారని టాక్. సినిమాలో ఆమె బికినీ షో హైలెట్ అంటున్నారు.