యంగ్ డైరెక్ట‌ర్ డ్రీమ్ నెర‌వేరుతోంది!

కొంత మందికి ఒక‌రితో క‌లిసి ప‌ని చేయాల‌ని అదే త‌మ జీవిత ల‌క్ష్య‌మ‌ని భావిస్తుంటారు. దాని కోసం ఎలాంటి ప్రాజెక్ట్‌లైనా వ‌దిలేస్తుంటారు. అలా త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ప్రాజెక్ట్‌ని ప‌క్క‌న పెట్టి త‌న జీవిత ఆశ‌యాన్ని నెర‌వేర్చుకోవ‌డానికి డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్ ముందుకొచ్చాడు. మ‌హేష్ హీరోగా మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ప‌ర‌శురాం ఓ సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. మ‌హేష్‌తో సినిమా చేయాల‌న్న‌ది ప‌ర‌శురామ్ గ‌త కొన్నేళ్లుగా కంటున్న క‌ళ‌.

ఆ క‌ళ ఇప్ప‌టికి నెర‌వేర‌బోతోంది. గీతా ఆర్ట్స్‌లోనే మ‌హేష్‌తో ప‌రశురామ్ సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేశాడు. కానీ గీతాలో సినిమా చేయ‌డానికి మ‌హేష్ అంత‌గా ఆస‌క్తిని చూపించ‌లేదు. దాంతో కాంపౌండ్‌ని మార్చిన ప‌ర‌శురామ్ మొత్తానికి మ‌హేష్‌ని ఒప్పించాడు. మైత్రీలో సినిమా చేసేందుకు మ‌హేష్ అంగీక‌రించేలా చేశాడు. స్టోరీ ఫైన‌ల్ స్టేజ్‌కి చేరిన ఈ చిత్రం త్వ‌ర‌లోనే ముహూర్తం జ‌రుపుకోనుంది. జూన్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తార‌ట‌. ఓ కొత్త క‌థ‌తో, ఫుల్ ఆఫ్ ఫ‌న్‌, ఎమోష‌న‌ల్ కంటెంట్‌తో ఈ సినిమా వుంటుంద‌ని తెలిసింది.